MPs Suspension: ఎంపీల సస్పెన్షన్ను ‘ఆయుధం’గా మార్చుకున్న ప్రభుత్వం : ఖర్గే
ఎంపీల సస్పెన్షన్ను (MPs suspension) అధికార పార్టీ ఓ ‘ఆయుధం’గా మార్చుకుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
దిల్లీ: పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో భారీ సంఖ్యలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ను (MPs suspension) అధికార పార్టీ ఓ ‘ఆయుధం’గా మార్చుకుందని ఆరోపించారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖఢ్కు ప్రతిస్పందనగా రాసిన లేఖలో ఖర్గే ఈ విధంగా వ్యాఖ్యానించారు.
‘ఎంపీల సస్పెన్షన్ను అనుకూలమైన సాధనంగా అధికార పార్టీ మార్చుకుంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పార్లమెంటు వ్యవహారాలను ఆయుధంగా మార్చుకున్నట్లయితే.. అణచివేతకు ఉద్దేశపూర్వ చర్యే అవుతుంది.’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
‘వాడీవేడీ చర్చలో ఉన్నా.. నవ్వులు పూయించగలరు’: వాజ్పేయీ జయంతి వేళ మోదీ నివాళి
ఉభయసభల నుంచి భారీ సంఖ్యలో సభ్యులను సస్పెన్షన్ చేయడం ప్రభుత్వ ముందస్తు వ్యూహంగానే కనిపిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. సభలో లేని ఇండియా కూటమి సభ్యుడినీ సస్పెండ్ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఇవన్నీ ఛైర్మన్ విచక్షణాధికారాల కిందకు వస్తాయనే విషయం తెలుసన్నారు. అయినప్పటికీ, భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి పార్లమెంటులో ప్రకటన చేయకుండా సభ జరుగుతోన్న సమయంలోనే ఓ టీవీ ఛానల్తో మాట్లాడటాన్ని తప్పుపట్టారు.
ఇదిలాఉంటే, సభా కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించనీయకుండా రాజ్యసభ ఛైర్పర్సన్ను ప్రతిపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఇటీవల పేర్కొన్నారు. ఆ సమయంలో తనను కలిసేందుకు ప్రతిపక్ష నేత తిరస్కరించడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు డిసెంబర్ 22న ఆయన లేఖ రాశారు. ధన్ఖడ్ లేవనెత్తిన ప్రశ్నలకు ఖర్గే పైవిధంగా బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్