S Jaishankar: అది మీ రికార్డు పోలింగ్‌ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్

మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. 

Updated : 24 Apr 2024 12:57 IST

దిల్లీ: భారత ఎన్నికల ప్రక్రియపై పాశ్చాత్య మీడియా కథనాలను విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ (S Jaishankar) ఖండించారు. రాజకీయ నేతల్లాగా భావిస్తూ వారు ఈ కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు.

‘‘మన ఎన్నికల అంశంపై పాశ్చాత్య మీడియా నుంచి నాకు పలు వ్యాఖ్యలు వినిపించాయి. వారు మన ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నది సరైన సమాచారం లేక కాదు. వారు కూడా మన ఎన్నికల్లో రాజకీయ నేతల్లాగానే ఆలోచిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. వేసవిలో ఎండలు మండిపోతుంటే.. ఈ సమయంలో ఎందుకు పోలింగ్ నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇంత వేడిలో కూడా మా అత్యల్ప ఓటింగ్ శాతం.. మీ రికార్డు స్థాయి ఓటింగ్‌ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నా" అని మంత్రి కౌంటర్ ఇచ్చారు. ‘‘వారు మన ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌, చివరకు మన వాతావరణ పరిస్థితులను కూడా ప్రశ్నిస్తారు. వాటన్నింటిని ఎదుర్కొనేందుకు మనం దృఢంగా ఉండాలి" అని వ్యాఖ్యానించారు.

దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలని, ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి జరిగిందని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అన్నారు. పదేళ్లకు పూర్వం దేశం పరిస్థితి ఏంటి.. మోదీ అధికార పగ్గాలు చేపట్టాక ఎలా ఉందనే విషయం ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని