Aircraft: బెంగళూరులో ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్.. దక్షిణాసియాలోనే మొట్ట మొదటిది!
రన్ వేపై ప్రమాదాలకు గురయిన విమానాలను సత్వరమే తొలగించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. అందుకోసం బెంగళూరులో (Bengaluru) ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటైంది.
బెంగళూరు: బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) ఆధ్వర్యంలో నూతన ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటైంది. దక్షిణాసియాలో ఏర్పాటైన ఈ మొట్టమొదటి పాఠశాలలో రన్ వేపై మరమ్మతులకు గురై నిలిచిపోయిన విమానాలను వేగంగా ఎలా పక్కకు తొలగించాలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం కోసం జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) ఆమోదించిన ‘ట్రైన్ఎయిర్ ప్లస్’ కార్యక్రమాన్ని అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం చేతికి స్విస్ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా
ప్రస్తుతం దేశంలోని అనేక విమానాశ్రయాల్లో రన్ వేలపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి గురైన విమానాలను నైపుణ్యవంతంగా పక్కకు తొలగించే సిబ్బంది కొరత ఉంది. దాంతో ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే విమానాల ప్రయాణం ఆలస్యమవుతోంది. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడ్ ‘ఎఫ్’ రికవరీ ఎయిర్క్రాఫ్ట్ పరికరాలతో స్కూల్ను ప్రారంభించామని బీఐఏఎల్ ఎండీ, సీఈవో హరి మరార్ తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇక్కడ శిక్షణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్లో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలుంటాయి. కనీసం ఐదు రోజులపాటు ఇక్కడ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాతో పోటీ పడటం నేర్చుకోవాలి
చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. -
యోగా చిచ్చర పిడుగు హర్షిక
కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. -
ఆసుపత్రికి తండ్రి భౌతికకాయం వితరణ.. నాన్న చివరి కోరికను నెరవేర్చిన కుమారులు
చనిపోయిన తరవాత తన శరీరాన్ని ఏదైనా వైద్యవిద్యా సంస్థకు దానం చేయాలన్న తండ్రి మాటను ఆ కుమారులు నెరవేర్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (3)
హవాలా కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. -
దర్శనమిచ్చిన బద్రీనాథుడు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. -
దిల్లీలో 20 ఆసుపత్రులకు, విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 20 ఆసుపత్రులు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ), ఉత్తర రైల్వే సీపీఆర్వో కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.