Amul Row: ఈసారి అమూల్ vs అవిన్.. తమిళనాడులో పాల రగడ
Amul vs Aavin: తమిళనాడు సహకార సంఘాల నుంచి పాల సేకరణ చేపట్టేందుకు అమూల్ సంస్థ చర్చలు జరపడం తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్నడ నాట ‘అమూల్ (Amul)’ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా మరో దక్షిణాది రాష్ట్రంలోనూ ఈ వివాదం మొదలైంది. గుజరాత్కు చెందిన ఈ ప్రముఖ డైరీ బ్రాండ్.. తమిళనాడు (Tamil nadu)లో పాలను సేకరిచేందుకు సిద్ధమైంది. అదే జరిగితే.. రాష్ట్రం ప్రభుత్వ డైరీ సంస్థ అవిన్ (Aavin) బ్రాండ్కు ఆదరణ తగ్గే ప్రమాదముందని ఆందోళనలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన స్టాలిన్ (MK Stalin) సర్కారు.. కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit shah)కు లేఖ రాశారు. తమిళనాడు నుంచి పాల సేకరణను ఆపేలా అమూల్ను ఆదేశించాలని కోరారు. అసలేం జరిగిదంటే.. (Amul vs Aavin)
గుజరాత్కు చెందిన అమూల్ (Amul) బ్రాండ్.. పలు రాష్ట్రాల్లోని రైతు సహకార సంఘాల నుంచి పాలను సేకరించి తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. అలాగే.. తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో పాలను సేకరించేందుకు అమూల్ అక్కడి రైతులతో చర్చలు జరుపుతోంది. తమిళనాడు డైరీ కోఆపరేటివ్ బ్రాండ్ అవిన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ధరను పాలను కొనుగోలు చేస్తామని అమూల్ ప్రతినిధులు రైతులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్.. గురువారం అమిత్ షాకు లేఖ రాశారు.
అవిన్ను దెబ్బతీసేందుకే..
‘‘అమూల్ డైరీకి చెందిన కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం.. తన బహుళ-రాష్ట్ర సహకార లైసెన్స్ను ఉపయోగించి కృష్ణగిరి జిల్లాలో శీతలీకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), స్వయం సహాయక సంఘాల ద్వారా పాలను సేకరించాలని అమూల్ యోచిస్తోంది. ఇది ‘ఆపరేషన్ శ్వేత విప్లవం’ స్ఫూర్తికి విరుద్ధం. దీనివల్ల పాల కొరతతో పాటు వినియోగదారులకు సమస్యలు ఎదురవుతాయి. అమూల్ చర్య.. అవిన్ (Aavin) పాల సమాఖ్య ప్రయోజనాలను అణచివేసినట్లే’’ అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
అంతేగాక, అమూల్ పాల సేకరణ వల్ల పాల ఉత్పత్తులను సేకరించి, విక్రయించే సహకార సంఘాల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తుందని సీఎం ఆరోపించారు. ప్రాంతీయ సహకార సంఘాలు రాష్ట్రాల్లో పాడిపరిశ్రమ అభివృద్ధికి పునాదిగా ఉన్నాయని, ధరలు ఏకపక్షంగా పెరగకుండా ఇవి ఉపయోగపడుతున్నాయని స్టాలిన్ గుర్తుచేశారు. అందువల్ల, ఈ వ్యవహారంలో వెంటనే కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని.. పాల సమాఖ్య నుంచి అమూల్ పాలు సేకరించకుండా తక్షణమే ఆదేశాలివ్వాలని సీఎం తన లేఖలో కోరారు.
ఇటీవల కర్ణాటకలోనూ అమూల్ బ్రాండ్ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. బెంగళూరులో ఆన్లైన్ డెలివరీలను ప్రారంభిస్తామని అమూల్ చేసిన ట్వీట్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో ఎన్నికల వేళ ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. భాజపాపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత