Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రమూక చేతికి చైనా ఆయుధాలు..
ఉగ్రవాదులు చైనా తయారీ పరికరాలను వాడుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇవి చైనా నుంచి పాకిస్థాన్ సైన్యానికి చేరగా.. అక్కడి నుంచి పీవోకేకు తరలిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులకు చైనా నుంచి సాయం అందుతున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకూ అమెరికా తయారీ ఎం4 రైఫిళ్లను మాత్రమే ఉగ్రమూక వాడినట్లు గుర్తించారు. తాజాగా ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేవారు చైనా తయారీ ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తేల్చారు. దీనికి అదనంగా చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు కూడా పాక్ ఆర్మీకి చేరుతున్నాయి. ఈ ఏడాది జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల్లో వీటిని వాడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ముఖ్యంగా చైనా సాంకేతికతతో తయారైన స్నైపర్ తుపాకులను ముష్కరులు వినియోగిస్తున్నారు. గత నవంబర్లో చొరబాట్లకు యత్నిస్తున్న సమయంలో పాక్ నుంచి ఓ స్నైపర్ కాల్పులు జరిపాడు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన మూడు భారీ ఉగ్రదాడుల్లో కూడా ముష్కరులు చైనా తయారీ బాడీ సూట్ కెమెరాలను వాడినట్లు తేలింది. బీజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ల వ్యవస్థలు కూడా వారి చేతిలో ఉన్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తరచూ చైనా నుంచి పాకిస్థాన్కు ఆయుధాలు, కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలు అందుతూనే ఉన్నాయి. వీటిని పాక్ సైన్యం వినియోగించకండా.. పీవోకేలో ఉగ్ర సంస్థలకు చేరవేస్తోంది. చొరబాట్లకు ఈ పరికరాలను వాడుతున్నారు.
అంతేకాదు పాక్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ వ్యవస్థ బలోపేతం చేసే కార్యక్రమాన్ని చైనానే పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ వార్ఫేర్ నిమిత్తం ఇప్పటికే పాకిస్థాన్లో ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు నిధులను సమకూర్చింది.
ఆ గుహలను కూల్చేయండి.. : ఆర్మీ చీఫ్ మనోజ్పాండే
ఉగ్రవాదం విషయంలో ఉపేక్షించవద్దని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే స్థానిక కమాండర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులు నక్కిన గుహలను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాజౌరీ-పూంఛ్ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డేరా కి గలీ, బుఫ్లియాజ్ ప్రాంతాలపై సైన్యం దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిన్న ఆర్మీ చీఫ్ జమ్మూలోని నగ్రోటాలో ఉన్న వైట్నైట్ కోర్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
కశ్మీర్లో ఆపరేషన్లపై స్థానిక వైట్నైట్ కోర్ ప్రధాన కార్యాలయంలో రక్షణ మంత్రి కూడా రివ్యూ మీటింగ్ను నిర్వహించే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా సమావేశం కావొచ్చు.
ఇటీవల ఉగ్రదాడి తర్వాత ముగ్గురు పౌరుల మరణాలు జమ్మూలో ఆందోళనలకు కారణం అయ్యాయి. దీనికి సంబంధించి ఓ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి పూంఛ్ బయటకు బదిలీ చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగుతోంది.
గత గురువారం పూంఛ్ జిల్లాలో రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాడులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించారు. దీంతో ముష్కరుల ఆటకట్టించేందుకు సైన్యం భారీ ఎత్తున దళాలను రాజౌరీ-పూంఛ్ ప్రాంతంలో మోహరించి ఉగ్ర నిరోధక గ్రిడ్ను బలోపేతం చేయాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ