Gaza: గాజాలో ఆకలి కేకలు.. గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు
అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది.
గాజా: గాజాను నిర్బంధించిన ఇజ్రాయెల్ దళాలు.. భూతల దాడులను ఉద్ధృతం (Israel Hamas Conflict) చేశాయి. దీంతో దేశం విడిచి బయటకు వెళ్లలేక.. అక్కడ సురక్షితంగా తలదాచుకోలేక 23 లక్షల మంది గాజా ప్రజలు మూడు వారాలుగా నలిగిపోతున్నారు. ముఖ్యంగా అన్నపానీయాలతోపాటు ఇతర అత్యవసర సామగ్రి లేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వీరికి సాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది.
ఇజ్రాయెల్- హమాస్ల మధ్య జరుగుతోన్న పోరు.. మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేల మంది గాజావాసులకు అత్యవసర వస్తువులను పాలస్తీనాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ, మానవతా విభాగం (UNRWA) అందిస్తోంది. దాని ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను వసతి గృహాలుగా మార్చింది. వీటిల్లో వేల సంఖ్యలో పునరావాసం పొందుతున్నారు. అయితే, ఇరువైపుల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గాజావాసుల కోసం ఈజిప్టు నుంచి పరిమిత స్థాయిలో సాయం అందుతోంది. ఈ క్రమంలో దీన స్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది నిస్సహాయులు.. గోదాంలలోకి చొరబడి గోధుమలు, పిండి, ఇతర నిత్యవసర వస్తువులు తీసుకెళ్లినట్లు యూఎన్ఆర్డబ్ల్యూఏ వెల్లడించింది.
ఇది ఇజ్రాయెల్ ఉనికికి పరీక్ష: ప్రధాని బెంజిమన్ నెతన్యాహు
ఇలా గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని.. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని యూఎన్ఆర్డబ్ల్యూఏ గాజా డైరెక్టర్ థామస్ వైట్ పేర్కొన్నారు. భయం, ఆందోళన, నిరాశతో ఉన్న గాజావాసుల్లో ఓపిన నశిస్తుందనడానికి ఇది అద్దం పడుతోందన్నారు. ఈజిప్టు నుంచి ట్రక్కుల్లో వస్తోన్న మానవతాసాయం సరిపడ స్థాయిలో లేదని.. మార్కెట్లో వీటి నిల్వలు నిండుకుంటున్నాయని అన్నారు. మరోవైపు ప్రత్యేక షెల్టర్లు కిక్కిరిసిపోతున్నాయని.. ఒక్కో షెల్టర్లో సాధారణం కంటే 12 రెట్లు ఎక్కువ జనం తలదాచుకుంటున్నారని అన్నారు.
రక్తపాతానికి ముగింపు పలకండి..!
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి విజ్ఞప్తి చేశారు. గాజాలో పరిస్థితులు గంట గంటకు క్షీణిస్తున్నాయని.. అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన వేళ ఇజ్రాయెల్ సైనిక దాడులు పెరగడం పట్ల చింతిస్తున్నానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
లఖ్నవూకు చెందిన ఓ యూట్యూబర్ గన్ను చూపిస్తూ చేసిన రీల్ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. -
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM