Unacademy: చదువుకున్న వారికే ఓటు వేయాలని చెప్పిన టీచర్.. ఉద్యోగం పీకేసిన ఎడ్టెక్ సంస్థ
చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ప్రముఖ ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదని పేర్కొంది.
దిల్లీ: చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఓ ఉపాధ్యాయుడిపై వేటు పడింది. బెంగళూరులోని ప్రముఖ ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కరణ్ సంగ్వాన్ను తొలగిస్తూ ఆ విద్యాసంస్థ నిర్ణయం తీసుకుంది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదని పేర్కొంది. కరణ్ సంగ్వాన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డాడని అన్అకాడమీ సహ వ్యవస్థాపకుడు రోమన్సైనీ పేర్కొన్నారు. అందుకే అతడిని తొలగించినట్లు వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఆగస్టు 19న అన్ని వివరాలు వెల్లడిస్తానని వేటుకు గురైన ఉపాధ్యాయుడు తెలిపారు. ‘‘గత కొన్నిరోజులుగా ఒక వీడియో వైరల్గా మారింది. దాంతో నేను వివాదంలో చిక్కుకున్నాను. న్యాయ సంబంధిత పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న నా విద్యార్థుల పాటు నేను సైతం పలు పరిణామాలు ఎదుర్కొంటున్నాను’’ అని సంగ్వాన్ తెలిపాడు.
చంద్రుడిని ముందుగా చేరేదెవరు..? చంద్రయాన్-3 Vs లూనా25పై ఉత్కంఠ!
అన్అకాడమీలో పనిచేస్తున్న సంగ్వాన్ పాఠాలు బోధిస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికే ఓటు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై అన్అకాడమీ సహవ్యవస్థాపకుడు సైనీ ట్వీట్(ఎక్స్) చేశారు. ‘‘నాణ్యమైన విద్యను అందించడానికి మా సంస్థ కట్టుబడి ఉంది. నిష్పాక్షికమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో మా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు కఠిన ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. మేము చేసే ప్రతిపనికి విద్యార్థులు కేంద్రంగా ఉంటారు. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన వేదిక కాదు. అవి విద్యార్థులను ప్రభావితం చేయగలవు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సంగ్వాన్ మాతో విడిపోవాల్సి వచ్చింది’’ అని సైనీ పేర్కొన్నారు.
ఈ విషయంపై దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. చదువుకున్న వారికి ఓటు వేయమని చెప్పడం నేరమా?అన్నారు. ఎవరైనా నిరక్షరాస్యులైతే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాననీ, కానీ, ప్రజాప్రతినిధులు కచ్చితంగా చదువుకున్నవారై ఉండాలని అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలు ఏలుతున్న కాలంలో చదువుకోని ప్రజాప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎప్పటికీ నిర్మించలేరని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
Mamata Banerjee: రాజ్భవన్ ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో గవర్నర్ చూపించిన వీడియో ఎడిటెడ్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన వద్ద ఫుల్ వీడియోల పెన్డ్రైవ్ ఉందన్నారు. -
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
మావోయిస్టుల కోటగా పేరున్న ఛత్తీస్గడ్లో భద్రతా దళాలు వ్యూహాత్మకంగా చొచ్చుకెళుతున్నాయి. దండకారణ్యాన్ని చీల్చుకొంటూ క్యాంపులు వేస్తున్నాయి. ఫలితంగా అడవుల నుంచి మావోలను వేగంగా ఏరివేస్తున్నాయి. -
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
లఖ్నవూకు చెందిన ఓ యూట్యూబర్ గన్ను చూపిస్తూ చేసిన రీల్ సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. -
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
International Space Station: చెన్నై గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్