Elections: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ స్టేషన్‌లో నేడు ఓటింగ్‌..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ స్టేషన్‌లో నేడు ఓటింగ్‌ కొనసాగుతోంది. 15 వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఉంది. 

Updated : 01 Jun 2024 16:51 IST

శిమ్లా: ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటరును భాగస్వామిని చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. అందుకోసం మారుమూల గ్రామాల నుంచి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ స్టేషన్‌ (Worlds Highest Polling Station)లోనూ నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఈ పోలింగ్‌ బూత్‌ హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఉంది.

హిమాలయ కొండల్లో సుమారు 15,256 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న గ్రామం తాషిగంగ్‌. ఇది భారత్‌- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉంది. ఇక్కడి పోలింగ్‌స్టేషన్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. మండి నియోజకవర్గం, స్పితి లోయ ప్రాంతం ప్రజలు ఇక్కడ ఓటు వేస్తున్నారు. నేటి ఉదయం హిమాలయాల్లోని ఒడిదుడుకులను దాటుకుని పోలింగ్‌ సిబ్బంది ఈ ప్రాంతానికి చేరుకున్నారు.

ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం

పోలింగ్‌ బూత్‌ను అందంగా ముస్తాబు చేసి ‘ఓటర్లకు స్వాగతం’ అని రాసిఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రికార్టు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నాలుగోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మండి నియోజకర్గం నుంచి భాజపా తరఫున బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, కాంగ్రెస్‌ నుంచి విక్రమాదిత్య సింగ్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని