PM Modi: ప్రభుత్వ జోక్యం లేని సమాజం కావాలి: ప్రధాని

భారత్‌లోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ ఈవెంట్‌-2024ను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Updated : 26 Feb 2024 16:38 IST

దిల్లీ: దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 (Bharat Tex 2024)ఈవెంట్‌ను దిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్‌ రంగం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకంగా మారనుందన్నారు. 

‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటికి భారత్‌ అభివృద్ధిలో టెక్స్‌టైల్స్‌ రంగం కీలకపాత్ర పోషించనుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. 2014 భారత్‌ టెక్స్‌టైల్స్‌ మార్కెట్‌ విలువ రూ.7 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అది రూ. 12 లక్షల కోట్లకు చేరుకుంది. మరి కొన్నేళ్లలో దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చాలని కేంద్రం సంకల్పించింది’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఈ నలుగురే మూల స్తంభాలు..

పాకిస్థాన్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే!

వికసిత్‌ భారత్‌కు పేదలు, రైతులు, యువత, మహిళలు ముఖ్య స్తంభాలని అన్నారు. వీరితో భారత్‌ టెక్స్‌టైల్స్‌ రంగం ముడిపడి ఉందన్నారు. అందువల్ల ఈ కార్యక్రమం మనందరికీ ఎంతో ముఖ్యమైందని మోదీ పేర్కొన్నారు. తాను ఎలాంటి సమాజాన్ని చూడాలనుకుంటున్నారో ప్రధాని ఈసందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్న సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇది ప్రజల శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. అందుకు పదేళ్లుగా పోరాడుతున్నానని.. రానున్న ఐదేళ్లల్లో ఈ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తానని మోదీ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు