Dheeraj Sahu: తండ్రి దేశానికి ‘దానం’ చేస్తే.. కొడుకు రూ.వందల కోట్ల అక్రమ సంపాదన!
ధీరజ్ సాహూ కంపెనీల్లో గుర్తించిన నగదు లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్ మెషిన్లను వినియోగించారు. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ(Dhiraj Prasad Sahu)కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపన్ను అధికారులు (Income Tax) జరిపిన దాడుల్లో రూ.వందల కోట్ల విలువైన కరెన్సీ లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వాటిని లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్ మెషిన్లను వినియోగించడం గమనార్హం. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ధీరజ్ సాహూ, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధీరజ్ కుమార్ తండ్రి బల్దేవ్ స్వాతంత్ర్య సమరయోధుడు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన సమయంలో .. ఆయన భారత ప్రభుత్వానికి రూ.47 లక్షల నగదు, 47 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా తండ్రి దేశానికి దానం ఇస్తే.. కుమారుడు మాత్రం అక్రమ సంపాదనలో ఆరితేరిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్తో ఎనలేని అనుబంధం..
- ధీరజ్ ప్రసాద్ సాహూకు ఐదుగురు సోదరులు. వీరిలో సాహు సహా నలుగురు రాజకీయాల్లో ఉన్నారు. ఒక సోదరుడు శివ్ ప్రసాద్ సాహూ లోక్సభ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ తరఫున రాంచీ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు.2001లో ఆయన మృతి చెందారు. మరో సోదరుడు నంద్లాల్ సాహూ కూడా లేరు. ధీరజ్ మరో సోదరుడు గోపాల్ సాహూ కాంగ్రెస్లో చురుకుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో హజారీబాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరో సోదరుడు ఉదయ్ సాహూ కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
- ధీరజ్ సాహూ ఝార్ఖండ్లోని చతరా నుంచి రెండుసార్లు పోటీ చేసి.. ఓటమిపాలయ్యాడు. 2009లో రాజ్యసభ ఉప ఎన్నికలో ఎంపికైన అతడు.. జులై 2010లో మరోసారి ఎన్నికయ్యాడు. 2018లో మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టాడు.
- ధీరజ్ సోదరుడు శివ్ ప్రసాద్ సాహూ ఇందిరా గాంధీతో సత్సంబంధాలు ఉండేవి. దీంతో ఆయన కుటుంబానికి పార్లమెంటు, అసెంబ్లీతోపాటు మంత్రి పదవుల్లోనూ ఆధిపత్యం కొనసాగింది.
- సాహూ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా, ఆర్థికంగానూ ఎంతో మద్దతుగా నిలిచేదని చెబుతుంటారు. ముఖ్యంగా ఝార్ఖండ్లోని లోహర్దాగాతోపాటు సమీప జిల్లాల్లో వీరికి మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఈ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తుంటుంది. వీళ్ల పూర్వీకుల ఇంటిని ‘వైట్ హౌస్ ఆఫ్ లోహర్దాగా’గా పిలిచేవారు. ఇక్కడికి రాజకీయ నేతలే కాకుండా సినీనటులు, క్రికెటర్లు కూడా వచ్చేవారట.
- సాహు కుటుంబానిది ‘మద్యం’ ప్రధాన వ్యాపారం. వీరికి సంబంధించి ఒడిశాలో ఎన్నో డిస్టిలరీలు ఉన్నాయి.
ధీరజ్ ఆస్తులు..
- 2018లో ఎన్నికల సంఘానికి అందించిన అఫిడవిట్లో రూ.34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ధీరజ్ సాహూ పేర్కొన్నారు. వీటిలో రూ.20 కోట్లు చరాస్తులు కాగా, మరో రూ.14 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ఇతర స్థిరాస్తులున్నట్లు చెప్పారు. నాలుగు కార్లు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
- ధీరజ్ సాహూ ఏడాది సంపద రూ.కోటిగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.3.1కిలోల బంగారం ఉందని, ఆయనకూ రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
Puducherry: మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్