Dheeraj Sahu: తండ్రి దేశానికి ‘దానం’ చేస్తే.. కొడుకు రూ.వందల కోట్ల అక్రమ సంపాదన!
ధీరజ్ సాహూ కంపెనీల్లో గుర్తించిన నగదు లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్ మెషిన్లను వినియోగించారు. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ(Dhiraj Prasad Sahu)కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపన్ను అధికారులు (Income Tax) జరిపిన దాడుల్లో రూ.వందల కోట్ల విలువైన కరెన్సీ లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వాటిని లెక్కించేందుకు 50 మందికిపైగా సిబ్బంది, 40 కౌంటింగ్ మెషిన్లను వినియోగించడం గమనార్హం. ఐదు రోజులు లెక్కించగా సుమారు రూ.350 కోట్లకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ధీరజ్ సాహూ, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధీరజ్ కుమార్ తండ్రి బల్దేవ్ స్వాతంత్ర్య సమరయోధుడు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన సమయంలో .. ఆయన భారత ప్రభుత్వానికి రూ.47 లక్షల నగదు, 47 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా తండ్రి దేశానికి దానం ఇస్తే.. కుమారుడు మాత్రం అక్రమ సంపాదనలో ఆరితేరిపోయాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్తో ఎనలేని అనుబంధం..
- ధీరజ్ ప్రసాద్ సాహూకు ఐదుగురు సోదరులు. వీరిలో సాహు సహా నలుగురు రాజకీయాల్లో ఉన్నారు. ఒక సోదరుడు శివ్ ప్రసాద్ సాహూ లోక్సభ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ తరఫున రాంచీ స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు.2001లో ఆయన మృతి చెందారు. మరో సోదరుడు నంద్లాల్ సాహూ కూడా లేరు. ధీరజ్ మరో సోదరుడు గోపాల్ సాహూ కాంగ్రెస్లో చురుకుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో హజారీబాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరో సోదరుడు ఉదయ్ సాహూ కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
- ధీరజ్ సాహూ ఝార్ఖండ్లోని చతరా నుంచి రెండుసార్లు పోటీ చేసి.. ఓటమిపాలయ్యాడు. 2009లో రాజ్యసభ ఉప ఎన్నికలో ఎంపికైన అతడు.. జులై 2010లో మరోసారి ఎన్నికయ్యాడు. 2018లో మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా అడుగుపెట్టాడు.
- ధీరజ్ సోదరుడు శివ్ ప్రసాద్ సాహూ ఇందిరా గాంధీతో సత్సంబంధాలు ఉండేవి. దీంతో ఆయన కుటుంబానికి పార్లమెంటు, అసెంబ్లీతోపాటు మంత్రి పదవుల్లోనూ ఆధిపత్యం కొనసాగింది.
- సాహూ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా, ఆర్థికంగానూ ఎంతో మద్దతుగా నిలిచేదని చెబుతుంటారు. ముఖ్యంగా ఝార్ఖండ్లోని లోహర్దాగాతోపాటు సమీప జిల్లాల్లో వీరికి మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఈ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తుంటుంది. వీళ్ల పూర్వీకుల ఇంటిని ‘వైట్ హౌస్ ఆఫ్ లోహర్దాగా’గా పిలిచేవారు. ఇక్కడికి రాజకీయ నేతలే కాకుండా సినీనటులు, క్రికెటర్లు కూడా వచ్చేవారట.
- సాహు కుటుంబానిది ‘మద్యం’ ప్రధాన వ్యాపారం. వీరికి సంబంధించి ఒడిశాలో ఎన్నో డిస్టిలరీలు ఉన్నాయి.
ధీరజ్ ఆస్తులు..
- 2018లో ఎన్నికల సంఘానికి అందించిన అఫిడవిట్లో రూ.34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ధీరజ్ సాహూ పేర్కొన్నారు. వీటిలో రూ.20 కోట్లు చరాస్తులు కాగా, మరో రూ.14 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ఇతర స్థిరాస్తులున్నట్లు చెప్పారు. నాలుగు కార్లు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
- ధీరజ్ సాహూ ఏడాది సంపద రూ.కోటిగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.3.1కిలోల బంగారం ఉందని, ఆయనకూ రూ.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
తమ సర్వీసుల నిలిపివేసే యోచన వాట్సప్, దాని మాతృసంస్థ మెటాకు లేదని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 5కోట్లకు పైనే: కేంద్రం
దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. -
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొత్త ఇంటికి మారనున్నారు. -
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది. -
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
17 ఏళ్ల నాటి హత్య కేసులో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
తన అనుచరులు చేసిన పనికి జైలు నుంచి విడుదలైన మూడు రోజుల్లోనే ఓ గ్యాంగ్స్టర్ తిరిగి అరెస్టయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొంది. -
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని మద్మహేశ్వర దేవాలయం వద్ద 50మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. -
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
కార్గిల్ యుద్ధం సమయంలో మోదీ అక్కడి యుద్ధ వీరులతో ముచ్చటించిన పలు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన