Rakesh Tikait: రైతుల్ని దిల్లీ వెళ్లకుండా ఆపితే.. నేతల్ని గ్రామాల్లోకి రానివ్వం: టికైత్ హెచ్చరిక
రైతులు దిల్లీ వెళ్లకుండా ఆడ్డుపడితే.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల్ని కూడా గ్రామాల్లోకి రానివ్వబోమని రైతు నేత రాకేశ్ టికైత్ హెచ్చరించారు.
మేరఠ్: పంటలకు కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధనకు అన్నదాతలు మరోసారి తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో దిల్లీ చలోకి బయల్దేరిన రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తీవ్రంగా స్పందించారు. రైతుల్ని దిల్లీ వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే.. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల్ని కూడా తమ గ్రామాల్లోకి రాకుండా చేస్తామని హెచ్చరించారు. పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు దిల్లీ చలోకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా మీరఠ్లోని రైతులు బుధవారం కలెక్టరేట్ వద్దకు చేరుకొని ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు వారు ముందుకురాకుండా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేయగా.. రైతులు వాటిని తొలగించి ముందుకుసాగారు.
‘మేం బాధ్యతగానే ఉన్నాం’: కేంద్రం అడ్వైజరీపై పంజాబ్ ప్రభుత్వం లేఖ
‘‘రోడ్డుపై ఇనుప కంచెలు వేయడం సబబు కాదు.. మా దారికి వాళ్లు అడ్డొస్తే మేం కూడా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఇలాగే చేస్తాం. మమ్మల్ని దిల్లీ వెళ్లకుండా అడ్డుకుంటే.. మా గ్రామాల్లోకి రాజకీయ నాయకుల్ని కూడా ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటాం. భాజపా సారథ్యంలోని కేంద్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోంది. ఇది రైతుల ప్రభుత్వమైతే.. కనీస మద్దతు ధరల హామీ చట్టాన్ని ఇప్పటికే అమలుచేసేది’’ అని రాకేశ్ టికైత్ అన్నారు. మరోవైపు, రైతుల పోరాటానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై గురువారం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమావేశం జరగనుందని టికైత్ చెప్పారు. మరోవైపు, రైతుల డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అర్జున్ముండా వెల్లడించారు. చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నామని.. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడమే ఇప్పుడు అవసరమని ఆయన ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.