CM-change: రెండున్నరేళ్లకు ‘సీఎం’ను మారుస్తారా..? సిద్ధరామయ్య ఏమన్నారంటే..!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు తానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి అధికార పార్టీలో ఓ వర్గంలో ఊహాగానాలు వెలువడటం చర్చనీయాంశమయ్యింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. అధికార మార్పు ప్రసక్తే లేదని.. ఐదేళ్లపాటు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చిచెప్పారు. కర్ణాటకలోని (Kannada Politics) హొస్పేట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అధికార మార్పిడిపై వస్తోన్న ఊహాగానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
‘ఐదేళ్లపాటు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతా. భాజపా భ్రమలో ఉంది. అధికారం లేకుండా వాళ్లు ఉండలేరు. ఓసారి ఆపరేషన్ కమలం విజయం సాధించడంతో మరోసారి అలాగే చేయొచ్చని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈసారి అలా చేయలేరు’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇక మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అంశంపై స్పందించిన ఆయన.. ‘మీకు ఎవరు చెప్పారు..? అవన్నీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. అధిష్ఠానంతో చర్చించకుండా ఏ నిర్ణయం జరగదు. నేను లేదా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని మార్చలేరు’ అని అన్నారు.
కాంగ్రెస్, అభివృద్ధి.. ఒకేదగ్గర మనుగడ సాగించలేవ్ : మోదీ
ఇదిలాఉంటే, కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను అధికారానికి దూరం చేసిన కాంగ్రెస్ పార్టీ.. పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రి పదవి చేపట్టే విషయంపై సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు అధిష్ఠానం నిర్ణయంతో మే 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకేఎస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య రాజీ కుదిరిందని.. రెండున్నరేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య అధికార మార్పిడి ఉంటుందనే వార్తలు వినిపించాయి. వీటిని పార్టీ ఖండించింది. తాజాగా ఇదే అంశం కన్నడ రాజకీయాల్లో మరోసారి చర్చకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
Supreme Court: ఒకే రకమైన పేర్లు ఉన్నంతమాత్రాన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా తాము నిలువరించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. -
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!