Yogi Adityanath: ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
దిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి ప్రసంగించారు.
‘‘గత పదేళ్లల్లో నవభారత నిర్మాణాన్ని చూశాం. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశాం. ఉగ్రవాదాన్ని అరికట్టాం. మూడేళ్లుగా పాకిస్థాన్లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారు. దానివెనక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయి. మన ప్రజలను చంపినవారిని మనం పూజించలేం కదా. తగిన బుద్ధి చెబుతాం. పీవోకేను ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ తీవ్రంగా యత్నిస్తోంది. కానీ, అలా జరగదు. మరో ఆరు నెలల్లో అది పూర్తిగా భారత్లో విలీనమవుతుంది. కానీ.. మూడోసారి కూడా మోదీయే ప్రధానిగా బాధ్యత వహిస్తేనే అది జరుగుతుంది’’ అని యోగి పేర్కొన్నారు.
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
కాంగ్రెస్ హయాంలో పేదలు చనిపోయారు
కాంగ్రెస్ హయాంలో పేదలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని యోగి ఆరోపించారు. ‘‘కానీ, మోదీ పాలనలో ఆ సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తోంది. భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనం ప్రతిఒక్కరి మనోభావాలను గౌరవించాలి. ప్రతీ ఆడబిడ్డకు భద్రత కల్పించాలి. ఉపాధి అందించాలి’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కవచ్’ ఉంటే బెంగాల్ రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ వ్యవస్థ..?
Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో ‘కవచ్ (Kavach)’ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటీ వ్యవస్థ..? -
ఇలా చేస్తే.. 6 నెలల పాటు తాజాగా కరివేపాకు: వైరల్ వీడియో చూశారా..?
కరివేపాకులను 6 నెలల పాటు తాజాగా నిల్వ చేసేలా ఓ చిట్కా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!
లోక్సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ (Lok Sabha Speaker) పదవి కీలకం. అది తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. -
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
కన్నడ నటుడు దర్శన్కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి పేరు వార్తల్లో నిలిచింది. -
మోదీ సర్కార్ వైఫల్యమే.. రైలు ప్రమాదానికి కారణం: ఖర్గే విమర్శలు
పశ్చిమబెంగాల్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రమాదానికి మోదీ సర్కార్ చేసిన వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. -
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతులకు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందించనుంది. -
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) వంటి చట్టాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన నేర చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. -
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్యకు ముందు.. అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. -
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని తక్షణమే రాజ్భవన్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు స్థానాలకు రాజీనామా చేస్తారా..? అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రశ్నించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
Yediyurappa: పోక్సో కేసులో విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. -
ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్ బిల్లు చెల్లించాల్సిందే.. సీఎం కీలక నిర్ణయం
జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లించదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. -
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
Train Collision: పశ్చిమ బెంగాల్లో ఓ ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం
కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించనుంది. -
మేరఠ్లో అతిపెద్ద భూగర్భ రైల్వేస్టేషన్
ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వేస్టేషను నిర్మాణం శరవేగంగా సాగుతోంది. -
సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి
నీట్లో జరిగిన అవకతవకల వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే అధికార్ల బృందంతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండు చేశారు. -
కోటాలో జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో జేఈఈ మెయిన్స్కు సన్నద్ధమవుతోన్న 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బిహార్కు చెందిన ఆయుష్.. ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. -
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా!
దేశ రాజధాని దిల్లీ నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. -
దిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్
నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిల్లీ నుంచి భోపాల్కు రైల్లో ప్రయాణించారు. -
ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం.