Uttar Pradesh: భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసుంటా.. కరెంట్‌ పోల్‌ ఎక్కి మహిళ ధర్నా

భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానంటూ ఓ మహిళ విద్యుత్‌ స్తంభం ఎక్కి ఆందోళనకు దిగింది. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుందీ ఘటన.

Updated : 04 Apr 2024 13:23 IST

గోరఖ్‌పుర్‌: భర్త, పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. చివరకు అది బయటపడటంతో ఇద్దరితో కలిసి ఉంటానంటూ మొండిపట్టు పట్టింది. అందుకు ఇంట్లోవాళ్లు అంగీకరించకపోవడంతో కరెంట్‌ పోల్‌ ఎక్కి నిరసన చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే, గత ఏడేళ్లుగా ఆ మహిళ పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యల దుమారం.. వివాదంలో మరో కాంగ్రెస్ నేత

ఈ క్రమంలోనే గ్రామంలోని విద్యుత్‌ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేయడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని