Wrestlers Protest: మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం: హెచ్చరించిన రెజ్లర్లు
బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమపై దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని స్టార్ రెజ్లర్లు (Wrestlers Protest) ఆరోపించారు. ఇటువంటి అవమానాలు భరించలేమని.. ఇలాగే కొనసాగిస్తే మాత్రం తమకు వచ్చిన పతకాలను వెనక్కి తీసుకోండని హెచ్చరించారు.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan)కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోన్న రెజ్లర్ల (Wrestlers Protest)పై దిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై క్రీడాకారులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే తమకు వచ్చిన పద్మశ్రీలతోపాటు ఇతర పతకాలను, అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి అవమానాలు భరించాల్సి వస్తే తమకు వచ్చిన ఈ గౌరవాలతో ప్రయోజనం లేదని విలపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
‘మా పతకాలను వెనక్కి తీసుకోండి. మమ్మల్ని చాలా అవమానాలకు గురిచేస్తున్నారు. మా గౌరవం కోసం పోరాడుతున్నాం. కానీ, వాళ్ల కాళ్లకింద నలిగిపోతున్నాం. మా పతకాలను వెనక్కి ఇవ్వడంతోపాటు మా జీవితాలను కూడా ఇచ్చేస్తాం. కానీ, మాకు మాత్రం న్యాయం చేయండి’ అని వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పురుష పోలీసులు అనుచితంగా ప్రవర్తించి వేధించారని.. ఆ సమయంలో ఏ ఒక్క మహిళా పోలీసు కూడా లేరని వాపోయారు.
చేయిచేసుకోవడం సిగ్గుచేటు..
మహిళా రెజ్లర్లపై పోలీసులు చేయిచేసుకోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. దేశ వనితలపై దాడులకు పాల్పడటానికి భాజపా (BJP) ఎన్నడూ వెనుకాడదని ఆరోపించారు. భాజపా ఇచ్చే ‘బేటీ బచావో’ నినాదం కేవలం మాటలకే పరిమితం అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
అది అహంకారమే..
తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లతో పోలీసులు ఘర్షణకు దిగడం జాతీయ క్రీడాకారులకు అవమానకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పేర్కొన్నారు. అహంకారంతోనే భాజపా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దౌర్జన్యంతో వ్యవస్థను నడపాలని భాజపా అనుకుంటోందని ఆరోపించిన కేజ్రీవాల్.. అధికారం నుంచి ఆ పార్టీని దూరం చేయాలని పిలుపునిచ్చారు.
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ మద్దతు
ఆందోళన చేస్తున్న స్టార్ రెజ్లర్లకు దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మద్దతు ప్రకటించారు. గురువారం ఉదయం దీక్షా స్థలికి చేరుకున్న ఆమె.. మహిళా క్రీడాకారిణులపై పోలీసు సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. దీనిపై ఫిర్యాదు అందిన అనంతరం వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియాలు క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన ఖేల్రత్న అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. వీరిలో సాక్షి మాలిక్(2017), బజరంగ్ పునియాలకు పద్మశ్రీ కూడా లభించింది. ఇదిలాఉంటే, దీక్షా శిబిరం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, రెజ్లర్ల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. నిరసనకారుల వసతి కోసం కొందరు మడత మంచాలు తీసుకురావడం ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు