Adah Sharma: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ..

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని నటి అదాశర్మ కొనుగోలు చేశారు. దాన్ని రీమోడలింగ్‌ చేసినట్లు తెలిపారు.

Published : 03 Jun 2024 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) ఇంటిని నటి అదాశర్మ (Adah Sharma) కొనుగోలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.  ఆమె ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. సుశాంత్ ఇంట్లోనే నివాసముంటున్నట్లు తెలిపారు. ఆ ఇంట్లో తన అనుభవాలను పంచుకున్నారు.

‘నెల క్రితమే  గతంలో సుశాంత్‌ నివాసమున్న ఇంట్లోకి మారాను. ఇన్ని రోజుల నుంచి వరుస సినిమాలతో బిజీగా ఉన్నందున మారలేకపోయాను. నేను కొన్ని విషయాల్లో సున్నితంగా ఉంటాను. ముంబయి, కేరళలో మా ఇళ్లు చెట్ల మధ్యలో ఉంటాయి. వాటిపై వాలిన పక్షులకు, ఉడుతలకు ఆహారం పెడుతుంటాం. సుశాంత్‌ ఇంటిని చూడగానే నాకు ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. అందుకే కొన్నాను. మొత్తం రీమోడలింగ్ చేశాను. వైట్‌ పెయింటింగ్‌ వేశాం. మొదటి అంతస్తుని గుడిలా మార్చేశాను. ఒక గదిని మ్యూజిక్‌ రూమ్‌గా, మరో దాన్ని డ్యాన్స్‌ స్టూడియోగా మార్చాను. టెర్రస్‌ మొత్తం గార్డెన్‌లా మార్చేశాను’ అని చెప్పారు.

రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?: కృతిశెట్టి రియాక్షన్‌ ఏంటంటే

నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురి కావడంతోనే ఆయన మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అదే ఇంటిని అదా (Adah Sharma)కొనుగోలు చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని