Tollywood: హృదయాన్నిహత్తుకునే కథతో..

కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి ఓ కొత్త హీరో తెరకు పరిచయమవుతున్నాడు. తనే మాధవ్‌ భూపతిరాజు.

Updated : 10 Aug 2022 03:24 IST

కథానాయకుడు రవితేజ కుటుంబం నుంచి ఓ కొత్త హీరో తెరకు పరిచయమవుతున్నాడు. తనే మాధవ్‌ భూపతిరాజు. రవితేజ సోదరుడైన రఘు తనయుడే ఈ మాధవ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని లుధీర్‌ బైరెడ్డి తెరకెక్కిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. రూబల్‌ షికావత్‌ కథానాయిక. ఈ సినిమాకి ‘ఏయ్‌.. పిల్లా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంగళవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘హృదయానికి హత్తుకునే అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందిస్తుంది. 90ల నేపథ్యంలో సాగే వింటేజ్‌ ప్రేమకథగా ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సంభాషణలు: అన్వర్‌, కూర్పు: ప్రసన్న, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని