aaditirao: ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి.
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. ఆమె, మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్న సిరీస్ ఇది. ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ రూపొందిస్తున్నారు. హీరామండీలోని కొందరు వేశ్యల జీవితం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. మే 1న సిరీస్ విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి.
- ‘‘హీరామండీలోని ప్రతి పాత్ర సినీప్రియుల్ని మెప్పించేలా ఉంటుంది. ఇందులో నేను బిబ్బోజాన్ అనే వేశ్య పాత్రలో కనిపించబోతున్నాను. బిబ్బోజాన్ స్వచ్ఛమైన మనసు ఉన్న మహిళ. ఆమెలో భిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. కానీ ఆమె ఎక్కడ పుట్టిందో ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యలా మారిందో తెలియని అయోమయంలో ఉంటుంది. ఇందులో తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంత దూరమైన వెళ్తుంది. నేను వ్యక్తిగతంగా కూడా అంతే. ఇంట్లో కూడా నాకు ప్రతి విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రేమపై నమ్మకం ఎక్కువ. ఈ సిరీస్లోని నా పాత్ర మాదిరిగానే నేను కూడా దేనిగురించైనా ధైర్యంగా మాట్లాడుతాను’’.
- ‘‘నా అభిమాన దర్శకుల్లో సంజయ్ సర్ ఒకరు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పద్మావత్’లోనూ నటించాను. మళ్లీ ఆయనతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురు చూశాను. సినిమాల్లో ఆయన స్త్రీలను చూపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. ఆ విధంగా పాత్రల్ని తీర్చదిద్దగల నైపుణ్యం కేవలం సంజయ్ సర్కు మాత్రమే సాధ్యం. ఒక పాత్రను భిన్నమైన కోణాల్లో చూపిస్తుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. నిజానికి ఈ ‘హీరామండీ’ కథ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ.. మనల్ని ఆ పాత్రలో లీనమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తారు. సంజయ్ సర్ నటీనటులపై చూపించే ప్రేమ, ఆప్యాయత అపారం. ఆయన హీరోయిన్లను కన్నబిడ్డల్లాగే చూసుకుంటారు. ఆయనతో పని చేస్తున్నప్పుడు మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే ఉత్తమ మార్గం’’.
- ‘‘ప్రస్తుతం ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు వచ్చినప్పటి నుంచి నటీనటుల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీలో వచ్చే సినిమాల్లో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. థియేటర్లలో వచ్చే సినిమాల్లో ఒక్కరే హీరో ఉంటారు. కానీ.. ఇందులో ఎవరికి వారే హీరో. నాకు ఈ రెండూ ఇష్టమే. కానీ.. ఓటీటీలో భిన్నమైన కంటెంట్తో సినిమాలు వస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ‘హీరామండీ’ కూడా ఓటీటీలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినోదభరితమైన ‘సంగీత్’
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా సాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంగీత్’. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పతాక పోరాటంలో నాని
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ‘సరిపోదా శనివారం’ చూడాల్సిందే. -
ప్రతిఒక్కరూ తమకు అన్వయించుకోగలిగే కథ ఇది
‘రాజు యాదవ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
హడలెత్తిస్తాం.. నవ్వించేస్తాం
ప్రేమకథలు.. కామెడీ ఎంటర్టైనర్లు.. ఇలా భిన్నమైన జానర్లలో చిత్రాలు వచ్చినప్పటికీ హారర్ చిత్రాలంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది సినీప్రియులకి. మరి ఈ హారర్ చిత్రాలకి కామెడీ తోడైతే ప్రేక్షకులకు పండగే కదా. భయపెడుతూ.. అంతలోనే నవ్వులు పూయించే హాస్యంతో ముందుకు సాగుతుంటాయి ఈ సినిమాలు. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని హారర్ చిత్రాలు కామెడీ అంశాల మేళవింపుగా రూపొందుతున్నాయి. -
జోడీ కుదిరినట్టేనా?
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. -
హైదరాబాద్లో రామ్చరణ్ ఆట
చాలా రోజులుగా సెట్స్పై ఉన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.... అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. -
ఆ మ్యాజిక్ కొన్నిసార్లే..!
సవాళ్లతో కూడిన పాత్రల్ని భుజాన మోసే కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ‘మహానటి’కి ముందు... తర్వాత అన్నట్టుగా మారింది ఆమె కెరీర్. అప్పట్నుంచి మరింత బాధ్యతగా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది కీర్తి. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో