aaditirao: ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి.
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. ఆమె, మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్న సిరీస్ ఇది. ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ రూపొందిస్తున్నారు. హీరామండీలోని కొందరు వేశ్యల జీవితం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. మే 1న సిరీస్ విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి.
- ‘‘హీరామండీలోని ప్రతి పాత్ర సినీప్రియుల్ని మెప్పించేలా ఉంటుంది. ఇందులో నేను బిబ్బోజాన్ అనే వేశ్య పాత్రలో కనిపించబోతున్నాను. బిబ్బోజాన్ స్వచ్ఛమైన మనసు ఉన్న మహిళ. ఆమెలో భిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. కానీ ఆమె ఎక్కడ పుట్టిందో ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యలా మారిందో తెలియని అయోమయంలో ఉంటుంది. ఇందులో తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎంత దూరమైన వెళ్తుంది. నేను వ్యక్తిగతంగా కూడా అంతే. ఇంట్లో కూడా నాకు ప్రతి విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రేమపై నమ్మకం ఎక్కువ. ఈ సిరీస్లోని నా పాత్ర మాదిరిగానే నేను కూడా దేనిగురించైనా ధైర్యంగా మాట్లాడుతాను’’.
- ‘‘నా అభిమాన దర్శకుల్లో సంజయ్ సర్ ఒకరు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పద్మావత్’లోనూ నటించాను. మళ్లీ ఆయనతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురు చూశాను. సినిమాల్లో ఆయన స్త్రీలను చూపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. ఆ విధంగా పాత్రల్ని తీర్చదిద్దగల నైపుణ్యం కేవలం సంజయ్ సర్కు మాత్రమే సాధ్యం. ఒక పాత్రను భిన్నమైన కోణాల్లో చూపిస్తుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. నిజానికి ఈ ‘హీరామండీ’ కథ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ.. మనల్ని ఆ పాత్రలో లీనమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తారు. సంజయ్ సర్ నటీనటులపై చూపించే ప్రేమ, ఆప్యాయత అపారం. ఆయన హీరోయిన్లను కన్నబిడ్డల్లాగే చూసుకుంటారు. ఆయనతో పని చేస్తున్నప్పుడు మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే ఉత్తమ మార్గం’’.
- ‘‘ప్రస్తుతం ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు వచ్చినప్పటి నుంచి నటీనటుల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీలో వచ్చే సినిమాల్లో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. థియేటర్లలో వచ్చే సినిమాల్లో ఒక్కరే హీరో ఉంటారు. కానీ.. ఇందులో ఎవరికి వారే హీరో. నాకు ఈ రెండూ ఇష్టమే. కానీ.. ఓటీటీలో భిన్నమైన కంటెంట్తో సినిమాలు వస్తున్నాయి. ఇవి ప్రేక్షకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ‘హీరామండీ’ కూడా ఓటీటీలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సినిమా రాక... థియేటర్ నిండక...
వేసవి వినోదం అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది... సినిమానే. సుదీర్ఘంగా సాగుతుంది ఈ సీజన్. స్టార్ హీరోల చిత్రాలు...పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు... -
దిమాక్ కిరికిరి
‘కిరాక్ పోరి వస్తే సైట్ మార్... ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్పా మార్... ఇదే నా స్టైల్’ అంటున్నాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. -
ఆరుతో అదృష్టం కలిసిరావాలి
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్ యువకథానాయిక జాన్వీ కపూర్. -
అహం.. కలహం
దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రమిది. -
ఆ హత్యల వెనక ఒక్కడు?
ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్పైకి!
‘మలైకోటై వాలిబన్’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్లాల్. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన. -
ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..