Chiranjeevi: చిరంజీవితో సినిమా చేస్తా: సందీప్‌ రెడ్డి వంగా

‘యానిమల్‌’ (Animal) సక్సెస్‌లో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు దర్శకుడు సందీప్‌ వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా అక్కడి సినీ ప్రియులతో ఆయన సరదాగా ముచ్చటించారు. 

Published : 09 Dec 2023 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy), ‘యానిమల్‌’ (Animal) వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన దర్శకత్వం వహించిన ‘యానిమల్‌’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సందీప్‌ తాజాగా యూఎస్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడి సినీ ప్రియులను కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా తనకు చిరంజీవితో కలిసి వర్క్‌ చేయాలని ఉందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవితో ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కిస్తానన్నారు.

అనంతరం ఆయన యూఎస్‌ ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పటి వరకూ జరిగిన చర్చా కార్యక్రమంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి నన్ను అడిగారు. నా ఇష్టాయిష్టాలను అడిగి తెలుసుకున్నారు. కానీ, స్త్రీ ద్వేషంపై ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఎందుకంటే, ఇక్కడ ఉన్న వాళ్లందరూ సినిమాని సినిమాలాగే చూశారు. అందుకు నేను సంతోషంగా ఉన్నా’’ అని చెప్పారు.

Bhagavanth Kesari: అలా చేసి ఉంటే.. ‘భగవంత్‌ కేసరి’ దెబ్బతినేది: పరుచూరి గోపాలకృష్ణ

‘కబీర్‌ సింగ్‌’ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రమిదే. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక (Rashmika) జంటగా నటించారు. అనిల్‌కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇక, ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ను తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని