Janhvi Kapoor: జాన్వీ కపూర్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా..!
జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
ఇంటర్నెట్ డెస్క్: శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కొంతకాలంలోనే క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి బోనీకపూర్ సూచనలు, సలహాలు పాటిస్తూ కెరీర్లో బిజీ నాయికగా మారుతోంది. నేడు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
డాక్టర్ చేయాలనుకుంది..
జాన్వీ కపూర్ను శ్రీదేవి డాక్టర్ని చేయాలని ఆశించింది. ఈ విషయాన్ని జాన్వీ స్వయంగా వెల్లడించింది. ‘నన్ను డాక్టర్గా చూడాలన్నది మా అమ్మ కోరిక. కానీ, నేను యాక్టర్ అయ్యాను. డాక్టర్ అయ్యేంత టాలెంట్ నాకు లేదేమో అనిపిస్తుంది’ అని సరదాగా చెప్పింది.
డ్యాన్స్, కవిత్వమంటే ఇష్టం..
ఈ సుందరికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ‘ధడక్’ సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం సమయం లభించినా డ్యాన్స్ చేసేది. సినిమాల్లోకి వచ్చాక డ్యాన్స్ క్లాసులకు వెళ్లడం కుదరలేదని చెప్పింది. అలాగే, కవిత్వమంటే చాలా ఇష్టమని.. అప్పుడప్పుడు కవితలు రాస్తానని తెలిపింది.
ఈ వాటర్ బాటిల్ ఎప్పుడూ ప్రత్యేకమే..
జాన్వీకపూర్ ఎప్పుడూ తన వెంట రెడ్ కలర్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటుంది. అది అంటే ఆమెకు ఇష్టమట. దానికి చుస్కీ అనే పేరు కూడా పెట్టుకుంది. ఇదే విషయాన్ని ఇన్స్టాలో వెల్లడించింది.
జాన్వీ పేరు వెనుక సీక్రెట్ ఇదే..
ఈ బాలీవుడ్ బ్యూటీ పేరంటే చాలా మందికి ఇష్టం. అయితే, జాన్వీకు ఈ పేరు పెట్టడం వెనుక ఓ క్యూట్ స్టోరీ ఉంది. 1997లో శ్రీదేవి, అనిల్ కపూర్ కలిసి ‘జుదాయి’ అనే సినిమాలో నటించారు. దీన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఆ సినిమాలో ఊర్మిళ మతోంద్కర్ కూడా కీలకపాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు జాన్వీ. ఈ పేరంటే శ్రీదేవి, బోనీకు చాలా ఇష్టమట. వారి మొదటి బిడ్డకు ఈ పేరు పెట్టాలని ఆ సినిమా సమయంలోనే నిర్ణయించుకున్నారట. అలా కుదిరిన పేరే జాన్వీ కపూర్.
జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
తండ్రికి తెలియకుండా టూర్..
ఒక టాక్ షోలో జాన్వీ తండ్రికి తెలియకుండా చేసిన ప్రయాణం గురించి చెప్పింది. ‘నేను నాన్నకు అబద్ధం చెప్పి లాస్ వెగాస్ వెళ్లాను. సినిమాకు వెళ్తున్నానని చెప్పి విమానంలో వెగాస్ వెళ్లాను. అక్కడ కొంతసమయం గడిపి వెంటనే రిటన్ అయ్యాను. ఆ ప్రయాణం ఎంతో థ్రిల్ను అందించింది’ అని నవ్వేసింది.
జాన్వీ పెళ్లిలో ఇవే వంటకాలు..
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ తన పెళ్లి గురించి వివరించింది. ‘నా పెళ్లి కచ్చితంగా తిరుపతిలోనే సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. నేను కాంచీవరం జరీ చీరను కట్టుకుంటాను. వివాహం తర్వాత ఇష్టపడే అన్ని దక్షిణాది వంటకాలతో దావత్ ఇస్తాను. ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం ఇలాంటివన్నీ ఉంటాయి’ అని తెలిపింది.
స్నేహితులకు దూరమయ్యాను..
అసభ్యకర రీతిలో ఫొటోమార్ఫింగ్ చేయడం వల్ల తను పాపులర్ అవ్వడానికి బదులు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు తన పాఠశాల రోజులను ఓ సందర్భంలో గుర్తు చేసుకుంది జాన్వీ. ‘కెమెరాలు, ఫొటోగ్రాఫర్స్ ఇవన్నీ చిన్నతనం నుంచి నా జీవితంలో ఒక భాగం. నాకు 10సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోను ఓ వెబ్సైట్లో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. దాన్ని చూసి నేను షాక్ అయ్యాను. ఈ అసభ్యకరమైన చిత్రాల వల్ల నేను పాపులర్ అవ్వడానికి బదులు నా స్నేహితులకు దూరమయ్యాను’ అని చెప్పి బాధపడింది.
మొదటి బాయ్ ఫ్రెండ్తో ముగిసిన బంధం..
‘‘నేను, నా మొదటి బాయ్ ఫ్రెండ్ రహస్యంగా కలుసుకునే వాళ్లం. మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా అబద్ధాలు చెప్పుకొనేవాళ్లం. దురదృష్టవశాత్తూ.. నేను చెప్పిన ఓ అబద్ధం కారణంగా ఆ రిలేషన్ ముగిసింది. అలాగే బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. వాళ్లతో నిజాయతీగా ఉంటే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నా. పేరంట్స్ నిర్ణయాలకు అనుగుణంగా వెళితే భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం’’ అంటూ తన మొదటి బాయ్ ఫ్రెండ్ గురించి జాన్వీ ఓ టాక్షోలో చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే