Paruchuri: ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌ స్థాయిని పెంచుతాయి : పరుచూరి గోపాల కృష్ణ

‘కల్కి’, ‘దేవర’ విజయం సాధించాలని పరుచూరి గోపాలకృష్ణ ఆకాంక్షించారు. ఇవి రెండూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతాయని అన్నారు.

Published : 29 May 2024 11:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), ‘దేవర’ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలకు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘ఆల్‌ ది బెస్ట్’ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ (Prabhas), జూనియర్‌ ఎన్టీఆర్‌ల గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో తనను పెదనాన్న అని పిలిచేది ఈ ఇద్దరు మాత్రమేనన్నారు.

‘గతంలో కొందరు హీరోలు ఏడాదిలో ఆరు, ఏడు సినిమాలు చేసేవారు. కృష్ణ అయితే ఏకంగా ఓ ఏడాది 12 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. భారీ బడ్జెట్‌ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ‘కల్కి’ సినిమా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానుంది. ఇందులో అగ్ర కథానాయకులు అమితాబ్‌, కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. ప్రభాస్‌తో పాటు ఈ ఇద్దరూ హీరోలు తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లో కుర్చీలో కూర్చోగలరా అనిపిస్తుంది. ఎంతో ఆసక్తితో ఎగిరి గంతులేయడం ఖాయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది కాబట్టి.. ఇది హిట్‌ అయితే నిర్మాతలతో పాటు ఎంతోమందికి మంచి జరుగుతుంది. ‘వర్షం’ సమయం నుంచి ప్రభాస్‌తో నాకు అనుబంధం ఉంది. ఆరడుగులు ఉన్నా.. ప్రభాస్‌ది పసిపిల్లాడి మనస్తత్వం. నాకు తెలిసి ఇప్పటి వరకు అతడి నుంచి పరుష పదజాలాన్ని నేను వినలేదు’ అన్నారు.

నాకు తెలియకుండా వారంలో పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్‌

ఇక ‘దేవర’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆది’ సినిమాలో కనిపించిన ఎన్టీఆర్‌ (NTR) ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగాడో తలచుకుంటే ఆనందంగా ఉంటుంది. త్వరలోనే ‘దేవర’తో రానున్నాడు. ఇందులో తారక్‌ గెటప్‌ చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ఇందులోనూ స్టార్స్‌ చాలా మంది నటిస్తున్నారు. ఇది అద్భుతమైన విజయాన్ని సాధించాలి. ‘కల్కి’, ‘దేవర’ రెండూ తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయి’ అంటూ చిత్రబృందాలకు శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని