Cinema News: నాగచైతన్యతో మరోసారి జోడీ కట్టనున్న పూజా!
టాలీవుడ్లో స్టార్హీరోయిన్గా దూసుకెళ్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్, తమిళ చిత్రం ‘బీస్ట్’లో విజయ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె నాగచైతన్యతో కలిసి రెండోసారి నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ‘మానాడు’కి దర్శకత్వం
హైదరాబాద్: టాలీవుడ్లో స్టార్హీరోయిన్గా దూసుకెళ్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’ చిత్రంలో రామ్చరణ్, తమిళ చిత్రం ‘బీస్ట్’లో విజయ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె నాగచైతన్యతో కలిసి రెండోసారి నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ‘మానాడు’కి దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు.. నాగచైతన్యతో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేనే సూట్ అవుతుందని వెంకట్ ప్రభు భావిస్తున్నారట. ఈమేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పూజా తొలి చిత్రం ‘ఒక లైలా కోసం’లో కథానాయకుడు నాగచైతన్యే కావడం, సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెంకట్ప్రభుకు పేరు ఉండటంతో ఈ చిత్రంలో నటించేందుకు పూజా ఒప్పుకుంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ‘మానాడు’ చిత్రాన్నే నాగచైతన్యతో రీమేక్ చేస్తున్నారని, కాదు.. మరో కొత్త కథతో రాబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే.. చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య