Animal: ఆ ఒక్క కారణంతో.. తొలివారం సుమారు రూ.40 కోట్లు నష్టపోయాం: ‘యానిమల్‌’ నిర్మాత

‘యానిమల్‌’ (Animal) వసూళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్ర నిర్మాత ప్రణయ్‌. తొలివారం కలెక్షన్స్‌ తగ్గడానికి గల కారణాన్ని వివరించారు. 

Published : 26 Dec 2023 01:51 IST

హైదరాబాద్‌: ‘యానిమల్‌’ (Animal) సినిమా వసూళ్లపై చిత్ర నిర్మాణ ప్రణయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తమ చిత్రం సుమారు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందన్నారు. వసూళ్ల విషయంలో తాము వాస్తవాలనే చెబుతున్నామని అందులో ఎలాంటి దాపరికం లేదన్నారు.

‘‘మేము ఇంకా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరలేదు. డిస్ట్రిబ్యూటర్స్‌ చెప్పిన లెక్కల ప్రకారం.. మొదటి వారంలో థియేటర్లు దొరక్క దాదాపు రూ.40 కోట్లు నష్టపోయాం. లాంగ్‌ వీకెండ్‌ లేకపోవడం, ఎ సర్టిఫికేట్‌ సినిమా కావడం, 3.21 గంటల నిడివి, అదే సమయంలో ‘సామ్‌ బహాదుర్‌’ రిలీజ్‌ కావడం ఇవన్నీ కూడా కారణాలే. మా చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులకు ఆసక్తి ఉన్నా థియేటర్లు సరిగ్గా దొరకలేదు. దీనివల్ల తొలివారంలో కలెక్షన్స్‌ కాస్త తక్కువగా వచ్చాయి. నిడివి ఎక్కువగా ఉందని ఎవరూ ఇబ్బందిపడలేదు. కాకపోతే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ గురించి చాలా మంది కామెంట్‌ చేశారు. విషయం ఏదైనా సరే అందర్నీ సంతృప్తి పరచడం వీలుపడదు. ప్రస్తుతం సందీప్‌ ‘యానిమల్‌’ ఓటీటీ వెర్షన్‌ కోసం వర్క్ చేస్తున్నాడు. కొత్త సీన్స్‌ యాడ్‌ చేయాలా? వద్దా? అనేది ఆలోచిస్తున్నాం. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం.. సెన్సార్ పూర్తయ్యాకే తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమా విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త సీన్స్‌ యాడ్‌ చేసి మరోసారి సెన్సార్‌కు వెళ్లాలా? లేదా థియేటర్‌ వెర్షన్‌లోనే విడుదల చేయాలా? అనేది చూస్తున్నాం’’ అని ప్రణయ్‌ తెలిపారు.

Kamal Haasan: వాటి వల్లే నేను ఈస్థాయికి చేరుకున్నా: కమల్‌ హాసన్‌

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor) - రష్మిక (Rashmika) జంటగా సందీప్‌ రెడ్డి వంగా తీర్చిదిద్దిన చిత్రం ‘యానిమల్‌’. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, త్రిప్తి డిమ్రి కీలక పాత్రలు పోషించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది. టీ సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్‌ 1న విడుదలైంది. ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ చేయనున్నట్లు సందీప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సీక్వెల్‌కు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో చేయనున్న ‘స్పిరిట్‌’ పనుల్లో సందీప్‌ త్వరలో బిజీ కానున్నారని.. ఆ ప్రాజెక్ట్‌ పూర్తైన తర్వాతే ఆయన ‘యానిమల్‌ పార్క్‌’ను రూపొందిస్తారని ప్రణయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని