Kamal Haasan: వాటి వల్లే నేను ఈస్థాయికి చేరుకున్నా: కమల్ హాసన్
భారీ వసూళ్లు సాధించే సినిమాల కన్నా మంచి చిత్రాల గురించే ప్రేక్షకులు ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారని కమల్ హాసన్ (Kamal Haasan)అన్నారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావాలని ఆయన కోరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘రూ.500 కోట్లు, రూ.600 కోట్లు సాధించే సినిమాల కన్నా... ప్రేక్షకులు మంచి చిత్రం గురించి ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకోవాలి. అన్ని రకాల సినిమాలు విడుదలై అలరించాలి’’ అని అన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఇండస్ట్రీలోని మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఆయన ఒకరు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే టీవీ రియాలిటీ షో కూడా చేస్తున్నారు. తమిళంలో ప్రసారమవుతున్న బిగ్బాస్ షోకు కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో తాజా ఎపిసోడ్లో సినిమాల వసూళ్లు విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మనం హోటల్లో ఆర్డరు ఇచ్చే మెనూలోనే అన్ని రకాలూ ఉండేలా చూసుకుంటాం. మరి వినోదం విషయంలో అలా ఎందుకు ఆలోచించం. ఒకే తరహా చిత్రాలు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు?. నేను ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యమిస్తాను. ఎందుకంటే నేను చిత్రపరిశ్రమకు పెద్ద అభిమానిని. కేవలం స్పెషల్ ఎఫెక్ట్లు, గ్రాఫిక్స్లు ఎక్కువగా ఉన్న సినిమాలే ఇండస్ట్రీని నిలబెట్టవు. చిన్న బడ్జెట్ చిత్రాలు లేకుండా పరిశ్రమ మనుగడ సాధించలేదు. కొత్త దర్శకులు, కొత్తగా ఆలోచించే వాళ్లు ఇండస్ట్రీలోకి రావాలి. సినీ పరిశ్రమ ఎప్పుడూ సూపర్ స్టార్లు, అగ్ర దర్శకుల మీదనే ఆధారపడి ఉండదు’’ అని అన్నారు కమల్. ఇలా చెబుతున్నానంటే ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదు అని చెప్పిన కమల్... చిన్న బడ్జెట్ చిత్రాల కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను అని గుర్తు చేశారు.
తొలిసారి కుమార్తెను చూపించిన అలియా - రణ్బీర్.. వీడియో వైరల్
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కమల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో కీలక పాత్రలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు వీటితోపాటు వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం కమల్ లైనప్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM