RajKundra: పోలీసులకు లక్షల్లో లంచమిచ్చిన రాజ్కుంద్రా?
‘పోర్న్ రాకెట్’ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఒకానొక సమయంలో పోలీసులకు లక్షల్లో లంచం
ముంబయి: ‘పోర్న్ రాకెట్’ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఒకానొక సమయంలో పోలీసులకు లక్షల్లో లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యశ్ ఠాకూర్ మార్చి నెలలో ఏసీబీకి (అవినీతి నిరోధక శాఖ) ఈ విషయంపై ఓ మెయిల్ పెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నారన్న సమాచారంతో ముంబయిలోని ఓ బంగ్లాపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా యశ్ ఠాకూర్ని సైతం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాజ్కుంద్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, తనని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు.. ఈ కేసులో తన పేరు లేకుండా చేసుకునేందుకు రాజ్కుంద్రా అప్పట్లో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారంటూ మార్చి నెలలో యశ్ ఠాకూర్ ఏసీబీకి మెయిల్ పంపించినట్లు తాజాగా పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ‘పోర్న్ రాకెట్’ గుట్టు బయటపెట్టిన ఆ వీడియో షూట్.. కేవలం వెబ్సిరీస్ కోసమేనని.. పోర్న్ కాదని రాజ్కుంద్రా తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది