Indian2: నా కెరీర్‌లోనే బెస్ట్‌ సినిమా ఇది.. ‘ఇండియన్‌-2’లో తన పాత్రపై రకుల్‌ కామెంట్స్‌

కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌-2’లో తన పాత్ర గురించి రకుల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంతో ఆత్మ విశ్వాసం ఉన్న మహిళగా కనిపించనున్నట్లు చెప్పారు.

Published : 11 Jun 2024 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul preet singh) కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత్ర గురించి తెలిపారు.

‘నా కెరీర్‌లోనే ‘ఇండియన్‌-2’ బెస్ట్‌ సినిమా అవుతుంది. ఇందులో నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గర పోలిక ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా కనిపిస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమా షూటింగ్ మొత్తం గొప్ప అనుభూతినిచ్చింది. శంకర్‌ వంటి అగ్ర దర్శకులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా విశేషాలను మీతో పంచుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. దానికి ఇంకా సమయం పడుతుంది’ అని తెలిపారు.

దళపతి విజయ్‌ మంచి మనసు.. వారికి సన్మానం చేయనున్న హీరో

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. 1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది ‘భారతీయుడు’. సేనాపతి పాత్రలో కమల్‌ (Kamal Haasan) ఆహార్యం, నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇది విడుదలైన వెంటనే మూడో భాగానికి సంబంధించిన నిర్మాణాంతర పనుల్ని మొదలు పెట్టనున్నారు. 

‘ఇండియన్‌2’లో మనీషా కొయిరాల

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌తో పాటు సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మనీషా కొయిరాల (Manisha Koirala) కూడా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్‌తో ఆమె దిగిన ఫొటో వైరల్‌ కావడంతో మనీషా కూడా అతిథిపాత్రలో నటించారని టాక్‌ వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని