Rashmika: రష్మిక ఘనత.. ఆ వేడుకలకు హాజరైన తొలి ఇండియన్‌ సెలబ్రిటీగా రికార్డు

టోక్యోలో జరగనున్న అవార్డు వేడుకకు హాజరుకావడం కోసం రష్మిక జపాన్‌ వెళ్లారు. అక్కడి అభిమానులు చూపిన ప్రేమకు ఆశ్చర్యపోయారు.

Updated : 02 Mar 2024 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ రష్మిక (Rashmika) ‘యానిమల్‌’తో మరో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడుకు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా రష్మిక జపాన్‌ వెళ్లారు. అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్‌ అనిమే అవార్డుల వేడకకు హాజరయ్యేందుకు రష్మిక జపాన్‌ వెళ్లారు. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని అభిమానాన్ని చూపించారు. దీంతో పాటు మరో అరుదైన అవార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు. భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం. ఈ ప్రయాణంపై ఆమె స్పందిస్తూ.. ‘మీరు నాపై చూపించే ప్రేమకు ఆశ్చర్యం వేస్తోంది. మీరంతా నా హృదయాన్ని గెలుచుకున్నారు’ అని పోస్ట్ పెట్టారు.

మహేశ్‌ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!

ప్రస్తుతం రష్మిక ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule)లో నటిస్తోన్నారు. అల్లు అర్జున్‌ (Allu Arjun)-సుకుమార్‌ కాంబోలో రానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. దీని షూటింగ్‌ రామెజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా జరుగుతోంది.  ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించగా, జూన్‌ లేదా జులై మొదటి వారానికి చిత్రీకరణ పూర్తి చేసి,  అదే నెలలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనితో పాటు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలోనూ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని