Pushpa2: ఎన్నో బాధ్యతలుంటాయి.. ‘పుష్ప2’లో పాత్రపై రష్మిక కామెంట్స్
‘పుష్ప2’లో తన పాత్రపై రష్మిక కామెంట్స్ చేశారు. ఓ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు టోక్యో వెళ్లిన ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం తెలుగు ఆడియన్స్తో పాటు యావత్ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule). అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప- ది రైజ్’కు సీక్వెల్గా ఇది రానుంది. మొదటిభాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక (Rashmika Mandanna) రెండో పార్ట్లోనూ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోనున్నారు. తాజాగా ఈ సీక్వెల్లో తన పాత్రపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మొదటిభాగం చివర్లో పుష్పరాజ్కు శ్రీవల్లితో పెళ్లి అయినట్లు చూపిన సంగతి తెలిసిందే. ఇదే మాటను రష్మిక చెప్పారు. ‘నేను రెండో పార్ట్లో పుష్పకు భార్యగా కనిపిస్తాను. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఈ సీక్వెల్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పర్ఫెక్ట్గా తీస్తారు. మొదటి భాగానికి భారీ స్థాయిలో స్పందన రావడంతో రెండో పార్ట్పై అధిక అంచనాలు నెలకొన్నాయి. సీన్స్లో ఎంత బాగా నటించగలమనేది ఆర్టిస్టులపై ఆధారపడి ఉంటుంది. ‘పుష్ప 2’ విషయానికొస్తే ఒక రోజు నేను అత్యుత్తమంగా నటించానని అనిపించింది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక చిత్రాన్ని ప్రారంభించినప్పటితో పోలిస్తే అది ముగిసేనాటికి మూవీ యూనిట్లో వారంతా మనకు బాగా దగ్గరవుతారు. నాకూ పుష్ప సమయంలోనే ఆ చిత్ర యూనిట్తో మంచి అనుబంధం ఏర్పడింది. సీక్వెల్ షూటింగ్ కోసం వెళ్లగానే సొంత ఇంటికి వెళ్లినట్లు అనిపించింది’ అని చెప్పారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
‘హనుమాన్’ క్లైమాక్స్కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్ వర్మ
ఇక టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడకకు హాజరయ్యేందుకు రష్మిక జపాన్ వెళ్లారు. ఈ వేడుకల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఈ ఈవెంట్ కోసం, ఇక్కడి వారందరినీ కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు సహజంగానే బిడియం ఎక్కువ. ఇప్పుడు అది ఇంకాస్త ఎక్కువైంది. ఆ వేడుకలో నన్ను ఎవరు పలకరించినా.. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అంటూ సంభాషణ మొదలుపెడతాను’ అంటూ రష్మిక సరదాగా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్