MaheshBabu - Rajamouli: ‘యానిమల్‌’ ప్రశ్న.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’ టీమ్స్‌ అదిరిపోయే రిప్లై..!

‘యానిమల్‌’ (Animal), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘బాహుబలి’ (Baahubali) టీమ్స్ మధ్య ట్విటర్‌ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. రాజమౌళి (Rajamouli) - మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా అప్‌డేట్‌కు సంబంధించిన ఈ సంభాషణలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Updated : 27 Nov 2023 15:09 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా అప్‌డేట్‌ గురించి ‘యానిమల్‌’ (Animal) టీమ్‌ చేసిన ట్వీట్‌పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘బాహుబలి’ (Baahubali) బృందాలు స్పందించాయి. ‘మా కెప్టెన్‌ గురించి మాకు బాగా తెలుసు’ అనే అర్థం వచ్చేలా సరదాగా రిప్లైలు ఇచ్చాయి. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ‘యానిమల్‌’ టీమ్‌.. మహేశ్‌ సినిమా గురించి ఎందుకు ట్వీట్‌ చేసిందంటే..!

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), రష్మిక (Rashmika) జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నేడు హైదరాబాద్‌లో జరగనుంది. మహేశ్‌బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ‘SSMB 29’కు సంబంధించిన అప్‌డేట్‌ ఏదైనా మహేశ్‌-జక్కన్న ఈ కార్యక్రమంలో చెప్పొచ్చని సినీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్‌ ఇవ్వమని కోరుతూ వరుస ట్వీట్‌ చేస్తున్నారు. అలా, ఓ అభిమాని చేసిన ట్వీట్‌పై ‘యానిమల్‌’ టీమ్‌ స్పందించింది.

డిసెంబరు ఫస్ట్‌ వీక్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీ వేరే లెవల్‌!

‘‘యానిమల్‌’ స్టేజ్‌పై మేము ఏదైనా అప్‌డేట్‌ ఆశించవచ్చా’’ అంటూ మహేశ్‌బాబు, రాజమౌళి ఖాతాలను ట్యాగ్‌ చేసింది. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ స్పందించింది. ‘‘మా కెప్టెన్‌ అంత త్వరగా ఏదీ చెప్పరు’’ అంటూ స్మైలీ ఎమోజీలు షేర్‌ చేసింది. ఈ సంభాషణలపై ‘బాహుబలి’ టీమ్‌ స్పందిస్తూ.. ‘‘అందరి కంటే ముందు ఈ విషయం మాకే తెలుసు’’ అని చమత్కారం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమా మేకింగ్‌ విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడరనే విషయం తెలిసిందే. ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుని అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ఇదే విషయంపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’ టీమ్స్ సరదాగా ట్వీట్స్‌ చేశాయి.

టీమ్‌ సూచన:

‘యానిమల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఉద్దేశించి తాజాగా ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శ్రేయస్‌ మీడియా ఓ ట్వీట్‌ చేసింది. మల్లారెడ్డి కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ వేడుక కేవలం విద్యార్థుల కోసమేనని.. బయటవాళ్లకు ఆహ్వానం లేదని తెలిపింది. కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్‌ను ఎప్పటికప్పుడు తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తామని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని