Samantha: జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి : సమంత

కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లినప్పటి ఫొటోలను సమంత మరోసారి షేర్‌ చేశారు.

Published : 11 Jun 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఎక్కువగా టూర్‌లకు, ఆశ్రమాలకు వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడల్లా వాటికి సంబంధించిన ఫొటోలను, అక్కడి అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే ఆమె సమయం దొరికినప్పుడల్లా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడ ధ్యానం చేస్తుంటారు. గతేడాది సామ్ (Samantha) అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలను తాజాగా మరోసారి పంచుకున్నారు.

‘గురువు, మెంటార్‌ కోసం మనలో చాలామంది వెతుకుతుంటారు. మన జీవితంలో వెలుగులు నింపి.. మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించిన ప్రత్యేకమైనది మరొకటి ఉండదు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు మనపై ప్రభావితం చూపుతుంటాయి. వాటిలో ఏవి సాధారణం, ఏవి అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వాటి గురించి కేవలం తెలుసుకోవడమే కాదు.. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలుచేయడం కూడా ముఖ్యమే’ అని రాసుకొచ్చారు.

ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ఇక సమంత కొన్ని నెలల విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram)లో నటిస్తున్నారు. దీనికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ (Tralala Moving Pictures)పై రూపొందుతున్న తొలి చిత్రమిది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని