‘ఆటో రజిని’.. ప్రేమకథ
జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడు. జె.సావిత్రి నిర్మిస్తున్నారు.
జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడు. జె.సావిత్రి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్లాప్ నివ్వగా.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘యాక్షన్కు ప్రాధాన్యమున్న ప్రేమకథతో ఈ సినిమా తీస్తున్నాం. ఈనెల 15 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మంచి సందేశంతో ఈ సినిమా రూపొందిస్తున్నామ’’న్నారు నిర్మాత. హీరో జోన్నలగడ్డ హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇదొక మాస్ సినిమా. అందరి నమ్మకాన్ని నిలబెడతామ’’న్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి