Bigg Boss Telugu 5: ‘టికెట్ టు ఫినాలే’ చివరి ఛాలెంజ్లో నిలిచే ఆ ఇద్దరు పోటీదారులు ఎవరు?
బిగ్బాస్ హౌస్లో ఇంటిసభ్యులందరూ తుది సమరానికి సన్నద్ధమవుతున్నారు. ‘టికెట్ టు ఫినాలే’లో భాగంగా ఇచ్చిన టాస్క్ల్లో విజయం సాధించిన మానస్, సన్నీ...
హైదరాబాద్: బిగ్బాస్ హౌస్లో ఇంటిసభ్యులందరూ తుది సమరానికి సన్నద్ధమవుతున్నారు. ‘టికెట్ టు ఫినాలే’లో భాగంగా ఇచ్చిన టాస్క్ల్లో విజయం సాధించిన మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్లకు బిగ్బాస్ తాజాగా ఓ సరికొత్త టాస్క్ ఇచ్చాడు. ఆక్యురసీ, మెమొరీ, ఫోకస్.. అనే మూడు టాస్క్ల్లో నలుగురూ ఏకాభిప్రాయంతో ఒక్కదాన్ని ఎంచుకోవాలని బిగ్బాస్ సూచించాడు. దీంతో సన్నీ.. ‘‘మేడమ్.. మీరే చెప్పండి’’ అని అడగ్గా.. ‘‘మొమరీ తప్ప ఏదైనా ఓకే’’ అని సిరి సమాధానమిచ్చింది. వెంటనే మానస్ అందుకుని.. ‘‘ఏ ఎందుకని?’’ ప్రశ్నించగా.. ‘‘మీకు ఉంది సర్. మాకు లేదు’’ అని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. దాంతో సన్నీ.. ‘‘మెమొరీ, ఫోకస్ వద్దు ఆక్యురసీకి పోదాం’’ అని అనడంతో.. ‘‘నేను ఆడను. నాకు ఫోకస్, మెమొరీ కావాలి’’ అని మానస్ సమాధానమిస్తాడు. దీనిపై స్పందించిన సన్నీ.. ‘‘కాజల్తో తిరిగి పెద్ద సైకోలా అవుతున్నావు రా’’ అంటూ సరదాగా కామెంట్ చేయడంతో ఇంటిసభ్యులందరూ పగలబడి నవ్వారు. సన్నీ కామెంట్తో కాజల్ షాక్ అవుతుంది. చివరికి వాళ్లందరూ ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకోగా.. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్తో సన్నీ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఇక, సిరి టాలెంట్కి ఇంటిసభ్యులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత లైట్స్ ఆఫ్, ఆన్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ టాస్క్లో గెలిచిన వారిలో ఇద్దరు టికెట్ టు ఫినాలే చివరి గేమ్ ఆడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి