Puri Musings: బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్
హైదరాబాద్: మన మెదడు పెద్ద దెయ్యమని, అందులో నిరంతరం ఆలోచనల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని దాన్ని అదుపు చేయాలని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. వివిధ అంశాలపై ‘పూరి మ్యూజింగ్స్’ అంటూ తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ది డెవిల్’ పేరుతో మెదడు, దాని ఆలోచన తీరుపై మాట్లాడారు.
‘‘ఎవడో మనకు వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో అవే ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మనల్ని ఎలా చంపుతాడోనని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ముందే పోలీస్ కంప్లయింట్ ఇస్తే మంచిదనుకుంటాం. నిద్ర పోయే ముందు ప్రతీ తలుపునకు తాళం వేస్తాం. ఒకవేళ వాడు ఈ రాత్రి రాలేదంటే, రేపు వస్తాడేమోనని ఎదురుచూస్తాం. స్కూటర్ మీద వెళ్లకపోవడం బెటరనుకుంటాం. ఎందుకంటే మన బండి నంబర్ రౌడీలకు ఇచ్చి దాడి చేయిస్తాడేమోనని ఆలోచిస్తాం. విషం కలుపుతాడేమోనని పిజ్జా ఆర్డర్ చేయటం కూడా మానేస్తాం. పది రోజులైనా మనల్ని చంపడానికి ఎవరూ రాకపోతే, ఇంకేదో మాస్టర్ ప్లాన్ వేశాడని అనుకుంటాం. ‘నిజంగా నన్ను చంపేస్తాడా? నేను చచ్చిపోతే నా పెళ్లాం-పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లు రోడ్డుపై అడుక్కుతింటారు. అలా జరగకూడదు. జరగనివ్వను. వాడు చంపేవరకు ఎందుకు? నేనే వాడిని చంపేస్తా’ అని చాలామంది తీర్మానానికి వచ్చేస్తారు. ఈ ఐడియా బాగా నచ్చుతుంది. ఆ రాత్రి వాడి ఇంటికి వెళ్లి గొడ్డలితో నరికేస్తారు. ఇక జీవితాంతం జైల్లో గడుపుతారు. వీటన్నింటికీ కారణం మన ఆలోచనలు’’
‘‘మన బ్రెయిన్ పెద్ద దెయ్యం. దానికున్న పెద్ద క్వాలిటీ ఆర్ట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. అనుక్షణం మన మెదడులో ఏవేవో ఆలోచనలు కుప్పలుతెప్పలుగా వచ్చేస్తాయి. సడెన్గా స్కూల్ డేస్ గుర్తుకువస్తాయి. రైల్లో చూసిన బెంగాలీ అమ్మాయి కనిపిస్తుంది. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. చిన్నప్పుడు చూసిన అమితాబ్ మూవీ.. ఇలా అంతులేని ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. ఒకరోజులో దాదాపు 60వేల ఆలోచనలు వస్తాయట. అందులో 95శాతం నెగెటివ్ థాట్స్. మన మైండ్ పెద్ద ఫియర్ ఫ్యాక్టరీ. అనుక్షణం భయాలను పుట్టిస్తూ ఉంటుంది. మైండ్ చెప్పేవి అస్సలు వినొద్దు. అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు. లేదంటే పిరికివాళ్లమైపోతాం. అందుకే ధ్యానం చేయాలి. కానీ, మనకు ఆ సమయం ఉండదు. లోపల ఉన్న దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి. ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మనశ్శాంతిగా ఉండండి’’ అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM