Kriti Sanon: నేషనల్ అవార్డ్ విన్నర్స్.. అల్లు అర్జున్, కృతి సనన్ కలిసి నటిస్తారా?
జాతీయ అవార్డుల విజేతలు అల్లు అర్జున్, కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు అభినందించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్ (Allu Arjun), ‘మిమీ’ (Mimi) చిత్రంలోని నటనకుగాను కృతిసనన్ (Kriti Sanon) జాతీయ అవార్డుకు (69th National Awards) ఎంపికైన సంగతి తెలిసిందే. మరి, ఈ ఇద్దరు కలిసి నటిస్తారా..? ఇప్పుడిదే ప్రశ్న తెరపైకి వచ్చింది. కృతి సనన్ పెట్టిన ట్వీట్ ఇందుకు కారణమైంది. ఇతర కేటగిరీల్లో విజేతలుగా నిలిచినవారితోపాటు ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కృతిసనన్, అలియా భట్లకు అల్లు అర్జున్.. ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఇటీవల అభినందనలు తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్కు కృతి కృతజ్ఞతలు చెప్పారు. ‘మీక్కూడా కంగ్రాట్స్. మీ నటనకు నేను అభిమానిని. ‘పుష్ప’లో అద్భుతంగా నటించారు’ అని కితాబిచ్చారు. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పారు. భవిష్యత్తులోనూ మిమ్మల్ని ఇలానే అలరిస్తానని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ ట్వీట్కు కృతి సనన్ తాజాగా రిప్లై ఇస్తూ.. మనిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు. దాంతో, ‘తదుపరి సినిమాలో హీరోయిన్గా కృతిని ఎంపిక చేయ్ అన్నా’ అంటూ కొందరు, ‘ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈ నేషనల్ అవార్డ్ వినర్స్ ఎప్పుడు కలిసి నటిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నువ్వు వైర్ కాదు డార్లింగ్.. ఫైర్
మహేశ్బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో కృతిసనన్ తెరంగేట్రం చేశారు. నాగచైతన్య సరసన ‘దోచేయ్’లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అయ్యారు. ప్రభాస్తో కలిసి నటించిన ‘ఆదిపురుష్’తో చాలాకాలానికి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!