kanakamedala: కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 14:38 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేందుకు యత్నినిస్తున్నారని అందులో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరును ఆయన ఖండించారు. బొండా ఉమా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎంపై రాయి దాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల లేఖలో విజ్ఞప్తి చేశారు.

జగన్‌ పాలనలో ఏపీ అల్లకల్లోలం

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని కనకమేడల రవీంద్ర అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి ఆయన ఒక బ్రాండ్ అని కితాబిచ్చారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా దిల్లీలో కనకమేడల కేక్ కోసి వేడుకలు చేశారు. జగన్‌ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారని మండిపడ్డారు. వైకాపా పాలనలో ఏపీ అల్లకల్లోలమైందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని