Delhi: అమిత్ షాతో బండి సంజయ్‌ భేటీ.. రాజకీయ పరిణామాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భాజపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.

Published : 24 Jul 2023 15:24 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో భాజపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) భేటీ అయ్యారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత అమిత్‌ షాను సంజయ్‌ కలవడం ఇదే తొలిసారి. ఈ మేరకు దిల్లీ వెళ్లిన ఆయన.. అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్‌ షాకు సంజయ్‌ వివరించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని