Purandeswari: ఇతర పార్టీలతో కలవాలా? వద్దా? అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది: పురందేశ్వరి

ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.

Published : 05 Jun 2022 13:58 IST

విజయవాడ: ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్లే పెట్టుబడులు రాక యువతకు ఉపాధి లభించడం లేదని విమర్శించారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో పార్టీ జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పురందేశ్వరి మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.

ఏపీలో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు. రాష్ట్రానికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. జనసేనతో పొత్తు యథావిధిగా కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. రెండు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో కలవాలా?వద్దా? అనేది భాజపా జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని