Shri Bharat: శ్రీభరత్‌ను అభినందించిన చంద్రబాబు, బాలయ్య

విశాఖ ఎంపీగా గెలుపొందిన శ్రీభరత్‌ను తెదేపా అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరులు అభినందించారు.

Updated : 05 Jun 2024 10:58 IST

అమరావతి: విశాఖ ఎంపీగా గెలుపొందిన శ్రీభరత్‌ను తెదేపా అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ తదితరులు అభినందించారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిపై 5లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో శ్రీభరత్‌ భారీ విజయం సాదించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తెదేపా అధినేత నివాసానికి వచ్చిన ఆయనకు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌, బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఘన విజయం సాధించడంతో బంధుమిత్రులంతా చంద్రబాబు నివాసానికి చేరుకుని సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేశ్‌, హిందూపురంలో బాలకృష్ణ, విశాఖ ఎంపీగా శ్రీభరత్‌ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని