Revanth Reddy: నిజాంకు నకలు కేసీఆర్: సీఎం రేవంత్రెడ్డి
భారాస (BRS) ప్రభుత్వ హయాంలో నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని కేసీఆర్(KCR) చూశారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
హైదరాబాద్: భారాస (BRS) ప్రభుత్వ హయాంలో నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని కేసీఆర్(KCR) చూశారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని.. కేసీఆర్ కూడా అలా చేయాలని భావించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారు. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదు. నిజాం నకలునే కేసీఆర్ చూపించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేశారు. 1948 సెప్టెంబర్ 17కు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2023 డిసెంబర్ 3కూ అంతే ప్రాధాన్యం ఉంది. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైతే.. 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన పోయింది. నియంతలు ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్లో టీజీ బదులు టీఎస్ తీసుకొచ్చారు. టీఆర్ఎస్కు నకలుగానే టీఎస్ను తెచ్చారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. మా ప్రభుత్వంలో ధర్నా చౌక్లో నిరసనలకు అనుమతులు ఇచ్చాం. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తాం.
రైతు భరోసాపై ఆందోళన వద్దు..
అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలుకొట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పనిలో స్వేచ్ఛను ఇచ్చాం. 26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. 32 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ పథకాన్ని అందుకున్నాయి. రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5 ఎకరాలు ఉన్న రైతుల వరకూ రైతుబంధు వారి ఖాతాల్లో పడింది. 62 లక్షల మందికి నగదు జమ చేశాం. ఇకపై గుట్టలు, రోడ్లు, బంగళాలు, లేఔట్లకు రైతు భరోసా ఇవ్వబోం. ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా దరఖాస్తు చేసుకోవాలి.. పరిశీలించి అందిస్తాం.
ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని భారాస, భాజపా నేతలు పదేపదే అంటున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా? కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారు.. కొట్టకుండా ఊరుకుంటామా?మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదు. ఈరోజు నుంచే నేనూ రాజకీయం ప్రారంభించాను. మా పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచా.. మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు గేటు ఓపెన్ చేశాం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాకు మంచి మిత్రుడు. ఆయనకు బలహీనవర్గాల పట్ల నిబద్ధత ఉంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా ఉండాలని కోరారు.. తిరస్కరించారు. కానీ.. కేసీఆర్ ఎలాంటి వారి నుంచైనా సగం బలం గుంజుకుంటారు. ప్రవీణ్కుమార్ భారాసలో చేరుతున్నారంటే నేనేమీ కామెంట్ చేయలేను’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్