Congress: కాంగ్రెస్ ఆరో జాబితా.. అమేఠీ, రాయ్బరేలీపై వీడని సస్పెన్స్
Congress: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈసారి కూడా అమేఠీ, రాయ్బరేలీ సీట్లపై ఎలాంటి ప్రకటన రాలేదు.
దిల్లీ: లోక్సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరో విడత అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్లోని నాలుగు, తమిళనాడులోని ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా స్థానంలో భాజపా మాజీ నేత ప్రహ్లాద్ గుంజాల్ను బరిలోకి దించింది. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేకు అత్యంత సన్నిహితుడైన ప్రహ్లాద్ గత వారమే కాంగ్రెస్లో చేరారు.
రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి రామచంద్ర చౌధరీ, రాజసమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి దామోదర్ గుర్జార్ను నిలబెట్టింది. తమిళనాడులోని తిరునెల్వేలి స్థానంలో ప్రముఖ అడ్వొకేట్ సి.రాబర్ట్ బ్రూస్ను పోటీకి దింపింది. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 190 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
మహువా మొయిత్రా vs రాజమాత.. బెంగాల్లో మరో ఆసక్తికర పోరు
అమేఠీ, రాయ్బరేలీపై ప్రకటన ఎప్పుడో..?
తాజా జాబితాలో అమేఠీ, రాయ్బరేలీ పేర్లు లేకపోవడంతో ఇక్కడ గాంధీ కుటుంబసభ్యుల పోటీ ఉంటుందా, లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమేఠీ నుంచి రాహుల్గాంధీ పోటీ చేయకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ స్థానంలో ఈసారి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది.
ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా దీనిపై పార్టీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హోలీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ ఇటీవల వెల్లడించారు. దీంతో, పార్టీ తదుపరి జాబితాలో ఈ స్థానాలపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్