అమరావతి రైతుల కన్నీటి కడలిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది: దేవినేని

రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ యాగం చేపట్టారు.

Updated : 16 Jul 2023 13:10 IST

అమరావతి: రాజధాని ప్రాంతంలోని మందడంలో రైతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ యాగం చేపట్టారు. రేపు ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతికి మద్దతుగా తీర్పు రావాలని ప్రార్థించారు. 

సుదర్శన యాగంలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రైతుల కన్నీటి కడలిలో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. సీఎం జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నుంచి రాజధానిని తరలించలేరని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని