Devineni Uma: సీఎస్‌ పదవికి మచ్చ తెచ్చిన జవహర్‌రెడ్డిని తప్పించాలి: దేవినేని ఉమ

సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు.

Updated : 30 May 2024 16:15 IST

మంగళగిరి: సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నిబంధనలు పాటించేవాళ్లు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. తెదేపా, జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైకాపా కుట్ర చేస్తోంది. సీఎం జగన్‌, సీఎస్‌ జవహర్‌రెడ్డి డైరెక్షన్‌లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎస్‌ పదవికే మచ్చ తెచ్చిన జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలి’’ అని దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని