‘కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్కు లేదు’
సీఎం జగన్ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం...
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
గుంటూరు: సీఎం జగన్ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల పాలనలోనే జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని.. మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్.. ప్రత్యేకోహోదా కోసం 22 మంది వైకాపా ఎంపీలతో ఎందుకు లోక్సభను స్తంభింపజేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకు లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మీడియా సమావేశంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్ వలి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం