Machilipatnam: తెదేపా కార్యకర్తపై వైకాపా ఇన్‌ఛార్జ్‌ పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

పేర్ని కిట్టు అనుచరులు మచిలీపట్నంలో వీరంగం సృష్టించారు. ఉల్లిపాలెంకు చెందిన తెదేపా కార్యకర్త యశ్వంత్‌పై వారు దాడి చేశారు.

Updated : 10 Mar 2024 10:26 IST

మచిలీపట్నం: వైకాపా ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అనుచరులు మచిలీపట్నంలో వీరంగం సృష్టించారు. ఉల్లిపాలెంకు చెందిన తెదేపా కార్యకర్త ఈడే యశ్వంత్‌పై వారు దాడి చేశారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు పేర్ని కిట్టు, అతడి అనుచరులపై యశ్వంత్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో తెదేపా బ్యానర్లు కడుతున్నారనే కక్షతో 20 మందికి పైగా వైకాపా నేతలు కిరాతకంగా దాడిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో పత్తి పవన్‌, హేమ నాని, చరణ్‌, పత్తి రామారావుతో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు