ఇందిర, రాజీవ్ల స్ఫూర్తికి కులగణన విరుద్ధం
కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్శర్మ భిన్నస్వరం వినిపించారు.
ఆనంద్శర్మ
దిల్లీ: కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్శర్మ భిన్నస్వరం వినిపించారు. ‘కులగణన’ దివ్యౌషధం ఏమీ కాదని.. నిరుద్యోగం, అసమానతలను తొలగించదని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తింపు రాజకీయాలు చేయలేదంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. ‘న జాత్ పర్ న పాత్ పర్.. మొహర్ లగేగీ హాథ్ పర్’ (కులాలపై కాదు.. హస్తం గుర్తుపైనే ఓటు ముద్ర) అని 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల నినాదం చేశారు. 1990లో రాజీవ్గాంధీ సైతం కులతత్వాన్ని ఎన్నికల అంశంగా మార్చడాన్ని వ్యతిరేకించారు. కులతత్వంపై కాంగ్రెస్ చారిత్రక వైఖరిని ఇవి చాటిచెబుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఆ ఆదర్శాల నుంచి దూరం జరిగితే ఇందిర, రాజీవ్ల స్ఫూర్తిని అగౌరవపరిచినట్లు ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉందని ఆనంద్శర్మ లేఖలో పేర్కొన్నారు. ఆనంద్శర్మ లేఖను ‘ఎక్స్’లో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. ‘రాహుల్ను సరిదిద్దేందుకు విశ్వాసపాత్రులైన కాంగ్రెస్ నేతలు పూనుకొన్నట్టుంది’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
జగన్ ఫొటోలు ఉన్న పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.