ఇక మాటల మంటలే!
లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మూడు ప్రధాన పార్టీలు
లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా.
28 రోజులు.. 50 సభలు
ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం
పదేళ్ల భారాస, భాజపా.. వంద రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచారపత్రాల తయారీ
నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున ప్రారంభించి.. రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా కదనరంగంలోకి దిగేలా రూట్మ్యాప్ రూపొందిస్తోంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. గత వంద రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. గత పదేళ్లలో తెలంగాణలో భారాస, కేంద్రంలో భాజపా సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను సైతం విడిగా తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా గ్రామాల్లో ప్రచారానికి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఇచ్చే హామీలపై స్థానిక నేతలకు రాష్ట్ర ప్రచార కమిటీ సూచనలు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
సీఎం సభలు.. రోడ్షోలు
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 దాకా రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం మూడుచోట్ల సీఎం సభలు నిర్వహించాలనేది ప్రణాళిక. గ్రేటర్ హైదరాబాద్ కలసిఉన్న లోక్సభ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఎంపీగా నెగ్గిన మల్కాజిగిరి కూడా నగరం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగరం పరిధిలోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన రోడ్షోలు ఎక్కువగా నిర్వహించనున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.
తరలిరానున్న ప్రముఖులు
అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు సైతం తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి. వారి వీలును బట్టి సభలు, రోడ్షోలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లే కాకుండా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచించింది.
అంతర్గత సర్వేలతో అప్రమత్తం
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది. ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతోంది, ఎక్కడ వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు హైదరాబాద్, దిల్లీల్లోని పార్టీ వార్ రూంలకు సమాచారం పంపుతారు. వార్ రూంల నుంచి సైతం నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతోంది, కాంగ్రెస్ నేతలు మీ వద్దకు వచ్చారా అని అంతర్గత సర్వే చేస్తారు. ప్రచార పత్రాలు సిద్ధం చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి విడివిడిగా ప్రచార ప్రణాళిక రూపొందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ‘ఈనాడు’కు తెలిపారు.
2-3 రోజుల్లో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన
రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వారి పేర్లను 2-3 రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి దిల్లీకి వెళ్తున్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.
మహారాష్ట్రలోనూ రేవంత్ ప్రచారం
ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని మహారాష్ట్రలో పెద్దసంఖ్యలో గ్రామాలు, పలు నియోజకవర్గాలున్నాయి. అక్కడ తెలంగాణ సీఎం ప్రచారం అవసరమని భావించి.. ఆయనను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో పది, అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎనిమిది శాసనసభ స్థానాల్లోనే గెలిచినా.. గతంలో కన్నా ఓట్ల శాతం పెరిగింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు