ఇక మాటల మంటలే!
లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మూడు ప్రధాన పార్టీలు
లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా.
28 రోజులు.. 50 సభలు
ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం
పదేళ్ల భారాస, భాజపా.. వంద రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచారపత్రాల తయారీ
నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున ప్రారంభించి.. రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా కదనరంగంలోకి దిగేలా రూట్మ్యాప్ రూపొందిస్తోంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. గత వంద రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. గత పదేళ్లలో తెలంగాణలో భారాస, కేంద్రంలో భాజపా సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను సైతం విడిగా తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా గ్రామాల్లో ప్రచారానికి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఇచ్చే హామీలపై స్థానిక నేతలకు రాష్ట్ర ప్రచార కమిటీ సూచనలు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
సీఎం సభలు.. రోడ్షోలు
పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 దాకా రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం మూడుచోట్ల సీఎం సభలు నిర్వహించాలనేది ప్రణాళిక. గ్రేటర్ హైదరాబాద్ కలసిఉన్న లోక్సభ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఎంపీగా నెగ్గిన మల్కాజిగిరి కూడా నగరం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగరం పరిధిలోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన రోడ్షోలు ఎక్కువగా నిర్వహించనున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడే సమయంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.
తరలిరానున్న ప్రముఖులు
అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు సైతం తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి. వారి వీలును బట్టి సభలు, రోడ్షోలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లే కాకుండా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచించింది.
అంతర్గత సర్వేలతో అప్రమత్తం
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది. ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతోంది, ఎక్కడ వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు హైదరాబాద్, దిల్లీల్లోని పార్టీ వార్ రూంలకు సమాచారం పంపుతారు. వార్ రూంల నుంచి సైతం నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతోంది, కాంగ్రెస్ నేతలు మీ వద్దకు వచ్చారా అని అంతర్గత సర్వే చేస్తారు. ప్రచార పత్రాలు సిద్ధం చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి విడివిడిగా ప్రచార ప్రణాళిక రూపొందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ‘ఈనాడు’కు తెలిపారు.
2-3 రోజుల్లో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన
రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వారి పేర్లను 2-3 రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి దిల్లీకి వెళ్తున్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.
మహారాష్ట్రలోనూ రేవంత్ ప్రచారం
ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని మహారాష్ట్రలో పెద్దసంఖ్యలో గ్రామాలు, పలు నియోజకవర్గాలున్నాయి. అక్కడ తెలంగాణ సీఎం ప్రచారం అవసరమని భావించి.. ఆయనను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో పది, అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎనిమిది శాసనసభ స్థానాల్లోనే గెలిచినా.. గతంలో కన్నా ఓట్ల శాతం పెరిగింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్