అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు.

Published : 19 Apr 2024 04:36 IST

సార్వత్రిక ఎన్నికల బరిలో దిగను
హిమాచల్‌ డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా

హమీర్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ముకేశ్‌ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. తన తల్లి సిమ్మి అగ్నిహోత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మృతిచెందిన సంగతిని గుర్తుచేశారు. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని.. ఇలాంటి విషాద సమయంలో ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నారు. హిమాచల్‌లోని హమీర్‌పుర్‌ స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ (భాజపా)కు వ్యతిరేకంగా ఆస్తాను బరిలో దించాలని కాంగ్రెస్‌ యోచిస్తున్న తరుణంలో ఆమె ప్రకటన వెలువడటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని