రాహుల్‌ను ప్రధానిని చేయాలి: తుమ్మల

పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు.

Published : 19 Apr 2024 04:40 IST

ఇల్లెందు, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి మహిళా కాంగ్రెస్‌ నాయకులతో భద్రాద్రి జిల్లా ఇల్లెందులో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 400 సీట్లలో పోటీ చేయని భాజపా...400 సీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణలోని బొగ్గు గనులు, ఆంధ్రాలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో చూపిన శ్రద్ధ రాష్ట్రాల అభివృద్ధిలో, ఉపాధి కల్పనలో చూపలేదన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని మాజీ సీఎం కేసీఆర్‌ వింతగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. భాజపా, భారాస లోపాయికారీ ఒప్పందంతో ఎన్నికల బరిలో నిలిచాయన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పురపాలక ఛైర్మన్‌ డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని