వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు

రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్‌ జగన్‌ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Published : 20 Apr 2024 04:30 IST

ఎన్డీయేను గెలిపించండి
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్‌ జగన్‌ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో శుక్రవారం నిర్వహించిన రాజంపేట-కడప పార్లమెంటరీ నియోజకవర్గాల సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. వైకాపా పాలనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్‌కు మళ్లీ ఓటేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విమర్శించారు. మాదిగ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు గెలిస్తేనే మాదిగలు అన్ని రంగాల్లో ముందుకెళ్తారన్నారు. వైకాపా ప్రభుత్వం దళితులు, గిరిజనుల సంక్షేమ పథకాలన్నింటిని రద్దు చేసిందన్నారు. మాదిగల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధిలేదన్నారు. ఇటీవల ప్రకటించిన పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్లో కూడా మాదిగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. మాదిగలు బాగుపడాలంటే ఎస్సీ వర్గీకరణ సాధించడమే ఏకైక మార్గమన్నారు. ఎన్డీయే కూటమి విజయంతోనే అది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని  మాదిగలందరూ కూటమి విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ జాతీయ నాయకులు నరేంద్ర బాబు, వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని